కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ ఎన్నికైన వేళ విశేషమేమిటో గాని కాంగ్రెస్ పార్టీకి గతంలో అశనిపాతంలా వున్న వ్యవహారాలన్నీ కూడా ప్రస్తుతం శుభసంకేతాలను ఇస్తున్నాయి. అధ్యక్ష పగ్గాలను అందుకున్న వెంటనే వచ్చిన గుజరాత్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కొద్దిలో అధికారన్ని దూరమయ్యింది. ఇప్పటికే 80 స్థానాల్లో విజయాన్ని కైవసం చేసుకున్న కాంగ్రెస్ మరో 15 స్థానాల్లో కేవలం వెయ్యి లోపు ఓట్లతోనే ఓటమిని చవిచూసి అధికారానికి దూరమైంది.
ఇక అ వెనువెంటనే యూపీఏ ప్రభుత్వ పరువును మసకబారేట్లు చేసిన 2జీ కుంభకోణం కేసులో కూడా నిందితులందర్నీ నిర్దోషులనే న్యాయస్థానం పరిగణించి.. ఈ కేసులో సాక్షాలను, అధారాలను పొందుపర్చడంలో దర్యాప్తు సంస్థ విఫలమైందని కూడా తీర్పును చెప్పింది. ఈ క్రమంలో ఇక మహారాష్ట్ర నేతలకు కూడా ఊరట లభించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు బాంబే హైకోర్టులో ఊరట లభించింది. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేసులో ఆయనను ప్రాసిక్యూట్ చేయరాదని అదేశాలను జారీ చేసింది.
ఈ మేరకు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యా సాగర్ రావు ఇచ్చిన అనుమతిని హైకోర్టు రద్దు చేసింది. జస్టిస్ రంజిత్ మోరే, జస్టిస్ సాధన జాదవ్ డివిజన్ బెంచ్ ఈ ఆదేశాలిచ్చింది. చవాన్కు వ్యతిరేకంగా తాజా సాక్ష్యం ఉన్నట్లు గవర్నర్ ఈ అనుమతిని మంజూరు చేయడానికి ముందు సీబీఐ పేర్కొందని, అయితే తాజా సాక్ష్యాన్ని సమర్పించడంలో సీబీఐ విఫలమైందని హైకోర్టు తెలిపింది. గవర్నర్ కు సీబీఐ సమర్పించిన పత్రాలను విశ్వసనీయ తాజా సాక్ష్యంగా పరిగణించడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.
అశోక్ చవాన్ను ప్రాసిక్యూట్ చేసేందుకు గవర్నర్ విద్యా సాగర్ రావు 2016 ఫిబ్రవరిలో అనుమతివ్వడంతో.. అశోక్ చవాన్ హైకోర్టును ఆశ్రయించారు. అదనపు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ను చవాన్ ఆమోదించారని, ఆయన తన బంధువుల నుంచి రెండు ఫ్లాట్లను తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. 2008 డిసెంబరు నుంచి 2010 నవంబరు వరకు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి ఆయన.. ఆదర్శ్ హౌసింగ్ సొసైటీలో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో వైదొలగిగారు. దక్షిణ ముంబైలోని విలాసవంతమైన ప్రాంతంలో ఈ గృహ నిర్మాణ ప్రాజెక్టు ఉంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more