ఉత్తరాధి రాష్ట్రాలలో తమ అధిపత్యాన్ని చాటుకున్న తరువాత ఏకంగా దేశంలో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హాయంలో నమోదైన రికార్డును కూడా కొల్లగొట్టి దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన బీజేపి.. ఇక దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తమ చేతి నుంచి జారీపోయిన కర్ణాటకపై ముందుగా గురిపెట్టింది. ఈ రాష్ట్రంలో అధికారాన్ని తిరిగి కైవసం చేసుకుని ఆ తరువాత మిగతా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయాలని భావిస్తుంది.
ఈ క్రమంలో ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ అధిత్యనాథ్ ను రంగంలోకి దింపగా, ఆయన వస్తూనే సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్ణాటకలో జరగబోయే ఎన్నికల్లో హనుమంతుడు, ఆయనకు పోటీగా టిప్పు సుల్తాన్ బరిలోకి దిగుతున్నారని యోగి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ముఖ్యమంత్రి యెడ్యూరప్ప అధ్యక్షతన జరిగిన పరివర్తన ర్యాలీని యోగి ప్రారంభించిన అనంతరం టిప్పు సుల్తాన్ శతజయంతోత్సవాలను ఘనంగా నిర్వహించిన పాలక కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు.
కర్ణాటకను హనుమంతుడి భూమిగా గుర్తిస్తారని, ఆయనను పూజించడం మానేసిన కాంగ్రెస్.. దైవారాధనను మాని మానవమాత్రుడైన టిప్పు సుల్తాన్ జన్మదిన వేడుకలు జరుపుతుందని మండిపడ్డారు. టిప్పు సుల్తాన్ ను స్వాతంత్ర్య సమర యోధుడిగా చెబుతున్న కాంగ్రెస్ ను హనుమంతుడు ఓడిస్తాడని చెప్పారు. ఓ వైపు బీజేపీ కార్యకర్తల హత్యలు జరుగుతుంటే... కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్ణాటకలో నిరంకుశ పాలన కొనసాగుతోందని విమర్శించారు.
కాగా యోగీ అదిత్యనాథ్ వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని అధికారంలోకి రావాలని చూసే పార్టీలకు ప్రజలు ఖచ్చితంగా గుణపాఠం చెబుతారని అన్నారు. సార్వత్రిక ఎన్నికలలో గుజారాత్ అభివృద్దిని చూపిన బీజేపి.. ఇక్కడ అభివృద్దిని చూసి కంటగింప్పుగా మారి.. ఇక చేసేది లేక హిందుత్వవాదాన్ని తమ భుజాలపై వేసుకుని సంచలన వ్యాక్యలు చేయడం సమంజసం కాదని చెప్పారు. తన పేరులోనూ సిద్ద, రామ అన్ని పేర్లు వున్నాయని గుర్తుచేశారు.
బీజేపి పార్టీలో హిందువులకు యాజమాన్య హక్కులను తీసుకుందా..? ఉత్తర్ ప్రదేశ్ లో గెలుపుకు ముస్లిం మహిళల ఓట్లే కారణమని చెప్పుకున్న బీజేపి కర్ణాటకకు వచ్చేసరికి తన వైఖరిని మార్చిందని గుర్తుచేశారు. బీజేపిలో కేవలం హిందువులే వున్నారా..? అని ప్రశ్నించారు. తాను హిందువునేనని చెప్పిన సిద్దరామయ్య.. తాను అన్ని మతాలను గౌరవిస్తానని, అన్ని మతాలలోనూ సోదరభావంతో మెలుగుతానని చెప్పారు. ఇదే అసలైన హిందుత్వమని చెప్పుకొచ్చారు. ఇక తాను యోగీ అధిత్యనాథ్ కంటే ఉన్నత్తమైన, ఉత్తమమైన హిందువునని చెప్పుకోచ్చిన ఆయన భక్తుడిగా యోగా బెష్ అని.. అయితే సీఎంగా రాష్ట్ర ప్రజలకు సేవలందించడంలో మాత్రం విఫలమయ్యారని విమర్శలు చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more