సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాలో కోడి పుంజులు రెక్కడు విధిల్చి సై.. సైరా అంటాయి. అందుకు అనాధిగా ఇక్కడ వస్తు్న అచారమే కారణం. కొన్నేళ్లుగా కోడి పందేలకు అనుమతి లేదంటూ అంక్షల నడుమ దొంగచాటుగా జరుగుతున్న కోడి పెందేలకు ఇక అలాంటి పరిస్థితి పోయింది. కోడి పందేలా విషయంలో తెలుగువారిలో కొట్టోచ్చినట్టు కనిపించిన ఐక్యత, సంస్కృతి, సంప్రదాయం తెచ్చిన యూనిటీ, ప్రత్యేక హోదా విషయంలో కూడా వుండివుంటే ఎప్పుడో వచ్చేసేదే అనుకుంటా.
ఈ విషయాన్ని పక్కన బెడితే.. ఈ సారి సంక్రాంతికి మాత్రం పోలీసులు వస్తారన్న భయం కానీ, కోడి పుంజులతో పాటు తమను కూడా కటకటాల వెనక్కి నెడుతారన్న అందోళన లేకుండా కోడిపందేలను అడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ మేరకు తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని జారి చేసిందని కూడా తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వహించుకోవచ్చునని ఆయన చెప్పారు. ఒక పక్క చట్టాలను గౌరవిస్తూనే, మరో పక్క అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.
అలాగని చట్టాన్ని అతిక్రమించే వారిపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చిరించారు. కాగా ఈ కోడిపందేలలో కోట్ల రూపాయల చేతులు మారుతుండటం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more