సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాలో కోడి పుంజులు రెక్కడు విధిల్చి సై.. సైరా అంటాయి. అందుకు అనాధిగా ఇక్కడ వస్తు్న అచారమే కారణం. కొన్నేళ్లుగా కోడి పందేలకు అనుమతి లేదంటూ అంక్షల నడుమ దొంగచాటుగా జరుగుతున్న కోడి పెందేలకు ఇక అలాంటి పరిస్థితి పోయింది. కోడి పందేలా విషయంలో తెలుగువారిలో కొట్టోచ్చినట్టు కనిపించిన ఐక్యత, సంస్కృతి, సంప్రదాయం తెచ్చిన యూనిటీ, ప్రత్యేక హోదా విషయంలో కూడా వుండివుంటే ఎప్పుడో వచ్చేసేదే అనుకుంటా.
ఈ విషయాన్ని పక్కన బెడితే.. ఈ సారి సంక్రాంతికి మాత్రం పోలీసులు వస్తారన్న భయం కానీ, కోడి పుంజులతో పాటు తమను కూడా కటకటాల వెనక్కి నెడుతారన్న అందోళన లేకుండా కోడిపందేలను అడుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప తెలిపారు. ఈ మేరకు తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను గౌరవించి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని జారి చేసిందని కూడా తెలిపారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు పందేలు నిర్వహించుకోవచ్చునని ఆయన చెప్పారు. ఒక పక్క చట్టాలను గౌరవిస్తూనే, మరో పక్క అనాదిగా వస్తున్న సంస్కృతి, సంప్రదాయాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఆయన అన్నారు.
అలాగని చట్టాన్ని అతిక్రమించే వారిపై మాత్రం చర్యలు తప్పవని హెచ్చిరించారు. కాగా ఈ కోడిపందేలలో కోట్ల రూపాయల చేతులు మారుతుండటం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకారంతో ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తామని ఆయన అన్నారు.
(And get your daily news straight to your inbox)
May 24 | రీసెర్చ్ అసోసియేట్ పోస్టు కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది ఇనిస్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్). ఎంపికైన వారికి వార్షిక వేతనం రూ.12 లక్షల వరకు ఉంటుంది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (IBPS)... Read more
May 24 | పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మన్ దేశరాజకీయాల్లోనే వినూత్నంగా తన మార్కు రాజకీయాలపై ముద్రవేశారు. తమ పార్టీ అధికారంలోకి రావడానికి మూలసూత్రమైన అవినితిపై రాజీలేని పోరాటం చేస్తామని.. ఈ విషయంలో తన, పర బేధాలకు కూడా... Read more
May 24 | నాగర్ కర్నూల్ జిల్లా మద్యం ప్రియుల అదృష్టం కలసివచ్చింది. తెలంగాణ ప్రభుత్వం మద్యం ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్న వారంలో.. నాగర్ కర్నూలుకు జిల్లా కేంద్రానికి సమీపంలో మందుబాబులకు మద్యంబాటిళ్లు ఉచితంగా లభించాయి. అదెలా... Read more
May 24 | వైద్యులు వృత్తిపరంగా ఎలాంటి నియమనిబంధనలు పాటించాలో పొందుపరుస్తూ తాజాగా జాతీయ మెడికల్ కమీషన్ ఓ ముసాయిదా నియమావళి-2022ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రతిని వారికి సంబంధించిన ఓ వైబ్ సైట్లో పొందుపర్చింది. అంతేకాదు..... Read more
May 24 | అరకు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులకు వ్యతిరేకంగా మావోయిస్టులు హెచ్చరికలు జారీచేశారు. అరకు ఎంపీ జి.మాధవి చెట్టి ఫాల్గుణ, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మిలకు వ్యతిరేకంగా మావోలు ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులుగా శాసనసభకు, లోక్ సభకు ఎన్నికైన వీరు... Read more