కామా తురానాం నభయం నలజ్జ అన్న నానుడిని బాగానే వంట పట్టించుకున్న ఓ వివాహిత ఇద్దరు పిల్లలు వున్న తరువాత కూడా అక్రమసంబంధాన్ని పెట్టుకుని.. భర్త వారించినా వినకుండా అ సుఖాన్నే కోరుకుని.. భర్తనే హతమార్చింది. అయితే భర్త అస్తులను మాత్రం కోల్పోవడం ఇష్టం లేని వివాహిత.. తన భర్త స్థానంలోకి తన ప్రియుడ్ని తీసుకువచ్చే ప్రయత్నం చేసింది. అయితే భర్త సంబంధికులు వచ్చి చూసిన తరువాత.. విషయాన్ని పసిగట్టడంతో అసలు విషయాలు బట్టబయలయ్యాయి. ఏకంగా రాంచరణ్ హీరోగా నటించిన ఎవడు చిత్రాన్ని మించిన రియల్ క్రైం స్టోరీగా నిలిచింది.
తన అక్రమ సంబంధం గురించి భర్తకు తెలిసిపోయింది. అతడు పలుమార్లు కూడా వారించాడు. అక్రమ సంబంధమే కావాలంటే విడాకులు ఇస్తాను వెళ్లిపోమ్మన్నాడు. దీంతో అతడ్నే అడ్డులేకుండా తొలగించుకుంటే.. ప్లాన్ చేసింది అ వివాహిత. అయితే భర్త లేకపోతే అతని అస్తిసాస్తులు కూడా రావు. అతని అస్తిపాస్తులు కూడా తమ వద్దనే వుండాలి. తామ సుఖంలో ఏ మాత్రం కొరత వుండకూడదు.. కానీ భర్తను మాత్రం కడతేర్చాలని ప్లాన్ చేసింది తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ ఇల్లాలు స్వాతి. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రియుడు రాజేష్ తో కలసి అమలు చేసింది.
ఇక భర్త శవాన్ని గుట్టుచప్పుడు కాకుండా కాల్చేశారు. అయితే ఇప్పుడు భర్త బంధువులకు ఏం చెప్పాలి. అనుకున్నదే ప్రణాళిక ప్రకారం భర్త స్థానంలోకి ప్రియుడ్ని తీసుకురావాలి. దీంతో ప్రియుడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది. హైదరాబాద్ లోని ఓ అస్పత్రిలో చికిత్స పోందుతున్న ప్రియుడు రాజేష్ ను తన భర్తగా అటు పోలీసులను, ఇటు బంధువులను నమ్మించింది. అయితే భర్త తల్లి, సోదరుడు పరామర్శించేందుకు వచ్చిన తరువాత.. అడ్డంగా దొరికిపోయి కటకటాల పాలైంది. తెలంగాణలో కలకలం రేపిన ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల కథనం ప్రకారం ఇలా వున్నాయి.
తెలకపల్లి మండలం బండపల్లికి చెందిన సుధాకర్రెడ్డి, తెలకపల్లికి చెందిన స్వాతిలది ప్రేమ వివాహం. ఏడేళ్ల క్రితం పెళ్లిచేసుకుని అన్యోన్యంగా బతికారు. వీరికి ఆరేళ్ల కుమారుడు, నాలుగేళ్ల పాప ఉన్నారు. కొన్నాళ్లు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసిన సుధాకర్రెడ్డి.. మూడేళ్ల క్రితం నాగర్ కర్నూల్ వచ్చి స్థిరపడ్డారు. క్రషర్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. వ్యాపారంలో తలమునకలైన సుధాకర్రెడ్డి ఇంటి వద్ద ఉండేది తక్కువే. ఎప్పుడో పొద్దున్ననగా వెళ్లి రాత్రికి వస్తారు. కొన్నిసార్లు వ్యాపారం పనిమీద వేరే ఊరు వెళ్లేవాడు.
దీంతో భర్త తనను పట్టించుకోవడంలేదని.. కేవలం డబ్బు సంపాదనపైనే దృష్టి సారించాడని భావించింది. అదే అవేదనలో మానసికంగా, శారీరికంగా తనకు వేరే తోడుంటే బాగుంటుందని అనిపించింది. తనకు సుఖం కలగడం లేదన్న అసంతృప్తితో రగిలిపోయింది. తనకు పెళ్లైందని.. భర్త వున్నాడన్న విషయాన్ని.. ఇద్దరు పిల్లలు వున్నారన్న సంగతిని మర్చిపోయి.. అడ్డదారి తొక్కింది. అయితే అప్పటికే నడుము నొప్పితో బాధపడుతున్న స్వాతి రెండేళ్ల క్రితం నాగర్ కర్నూల్ లోనే రాజేశ్ అనే ఫిజియోథెరపిస్టు దగ్గరికి వెళ్లింది. భర్తపై అసంతృప్తితో రగలిపోతున్న స్వాతికి ఫిజియోధెరఫీ పేరుతో రాజేష్ దగ్గరయ్యాడు.
కావాల్సింది ఎక్కడ నుంచి లభిస్తే ఏంటని అనుకుందో ఏమో రాజేష్ కు చటుక్కున లొంగిపోయింది. అతనితో అక్రమ సంబంధం పెట్టుకుంది. సుధాకర్ రెడ్డి ఇంట్లో లేని సమయంలో రాజేశ్ తరచూ స్వాతి వద్దకు వచ్చి వెళ్తుండేవాడు. ఈ క్రమంలో వీరి సంబంధం గురించి సుధాకర్ రెడ్డికి తెలిసిపోయింది. గొడవ కూడా జరిగింది. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని అనుకుంది. అవకాశం కోసం వేచి చూసి నిందితులిద్దరూ గత నెల 27 తెల్లవారుజామున సుధాకర్రెడ్డికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి హతమార్చి.. అతని కారులోనే మహబూబ్ నగర్ కు సమీపంలోని ఫతేపూర్ మైసమ్మ ఆలయ సమీంపలోని అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more