పంజాబ్ లో దారుణం చోటుచేసుకుంది. సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునేలా భార్యతో వ్యవహరించాడో భర్త. భర్త అనేకన్నా.. పైశాచిక మృగం అనడమే సముచితం. తన భార్య విడాకుల కోసం నిత్యం వేధిస్తూ, మనసికంగా, శారీరికంగా హింసిస్తూ.. చివరకు అమెపై అత్యాచారం చేయిస్తానని బెదిరించిన భర్తు.. అన్నంత పని చేశాడు. అమె నుంచి బలవంతంగా విడాకులు పొందేందుకు తన ముగ్గురు స్నేహితులతో ఆమెపై సామూహిక అత్యాచారం చేయించాడు.
ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... పంజాబ్ లోని లూధియానాలో బాధితురాలు మూడేళ్లక్రితం కూలి పని చేసే వ్యక్తిని వివాహం చేసుకుంది. వారిద్దరికీ అది రెండో వివాహమే. అయితే అమెపై వున్న మోజుతోనే పెళ్లి చేసుకున్న కామాంధుడు.. దాంపత్య జీవితంలో పిల్లలు కనడానికి మాత్రం అయిష్టత వ్యకత్ం చేశాడు. అయితే ఈ క్రమంలో బాగంగా ఒకటి కాదు రెండు కాదు మూడేళ్ల దాంపత్య జీవినంలో కనీసం 8 సార్లు అమెకు అబార్షన్ చేయించాడు.
ఇలా లాభం లేదని భావించాడో ఏమోకానీ.. ఆ తర్వాత ఏకంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కూడా చేయించాడు. అయితే విషయం తెలిసిన అమె అతడ్ని నిలదీయడంతో.. తనను అమెంటే ఇష్టం లేదని తనకు విడాకులివ్వాలని బాధితురాలిని వేధించసాగాడు. అయితే అందుకు ఆమె నిరాకరించింది. పిల్లలు పుట్టకపోయినా పర్వాలేదు కానీ భర్తను వదిలేయడం ఇష్టం లేదని, తాను విడాకులు ఇవ్వనని తేల్చిచెప్పింది.
దీంతో విడాకులు ఇవ్వకపోతే తాను అమెపై గ్యాంగ్ రేప్ చేయిస్తానని కూడా చాలా సార్లు హెచ్చరించిన భర్త మాటలను అమె లైట్ గా తీసుకుంది. అయితే ఆమెను ఎలాగైనా వదిలించుకోవాలని భావించిన సదరు భర్త మాత్రం అన్నంత పని చేశాడు. గత జూన్ 6న తన ముగ్గురు స్నేహితులను ఆమె గదిలోకి పంపి తాళం వేశాడు. దీంతో రెచ్చిపోయిన ఆ కామాంధులు ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా ఇది మరోసారి వివాదంగా మారడంతో సామూహిక అత్యాచారం కింద కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more