దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీపై ప్రేమను కనబర్చుకునే క్రమంలో సామాన్యులు హద్దులు మిరితే అర్థం చేసుకోవచ్చు.. కానీ పార్టీకి చెందిన ఎంపీలే.. పరిధులు ధాటడంతో పాటు.. వారు చెప్పిన మాటలను కూడా అలకించకుండా పెడచెవిన పెట్టి మరీ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. గత ఏడాది నోట్ల రద్దు సమయానికి ముందు విపరీతంగా చోటుచేసుకున్న ఈ తరహా ఘటనలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.
కయ్యానికి కాలుదువ్వేలా.. అధికార దర్పంతో మాట్లాడుతున్న మాటల మాదిరిగా వున్న పార్టీ నేతల వ్యాఖ్యలు సామాన్యులను అందోళనలోకి నెడుతున్నాయి. తాజాగా బిహార్ బీజేపీ అధ్యక్షుడు, ఉజియర్ పూర్ ఎంపీ నిత్యానంద రాయ్ ఇలాంటి వ్యాక్యలే చేసి కాంట్రవర్సీ రాజేశారు. బెంగుళూరులో జరిగిన పార్టీ సమావేశంలో నోరుజారితే వేటు పడుతుందని పార్టీ నేతలకు అమిత్ షా గట్టి హెచ్చరికలు చేసినా.. పార్టీకి చెందిన ఎంపీలే పెడచెవిన పెడుతున్నారు.
నరేంద్ర మోడీని వేలెత్తి చూపే వారి చేతులు, వేళ్లు నరికేస్తామని నిత్యానంద వ్యాఖ్యానించి దుమారం రేపారు. ‘మీ సొంత కుమారుడు పేదరికాన్ని జయించి ప్రధానమంత్రి అయ్యారు. మనుషుల మధ్య అభిప్రాయబేధాలు సహజం. దేశంలో వాటికి విలువ ఇవ్వాల్సిందే. ఆయనకు(మోదీ)కి వ్యతిరేకంగా ఎవరైనా చేయి లేదా వేలెత్తి చూపితే వాటిని విరగొట్టేందుకు మేమంతా ఒక్కటవుతాం. నరకడానికి కూడా వెనుకాడబోమ’ని వ్యాఖ్యానించడం వివాదాస్పదం అయ్యింది.
నిత్యానంద వ్యాఖ్యలను ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఖండించారు. బీజేపీ నేతలు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. నిత్యానంద వ్యాఖ్యలను జేడీ(యూ) నాయకుడు అజయ్ అలోక్ సమర్థించారు. ఆయన మాటల్లోని భావోద్వేగాలు చూడాలని, ఆయన వాడిన మాటలు కాదని అన్నారు. నరేంద్ర మోదీ రూపంలో స్వామి వివేకానంద మళ్లీ పుట్టారని నిత్యానంద పేర్కొనడం గమనార్హం. కాగా, మూడున్నరేళ్ల క్రితం దేశమంతా నమో మంత్రం జపించినప్పుడు లేని అందోళన, భావోద్వేగం.. ఇప్పుడు విమర్శించే సమయానికి ఎందుకు వర్తిస్తుందని, అంటే బీజేపి నేతలే మోడీ మానియా తగ్గిపోయిందని అంగీకరిస్తున్నారా..? అంటూ విపక్ష కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more