ప్రవేశం నుంచి నిత్యం సంచలనాలకు తెరలేపుతూ వచ్చిన రిలయన్స్ జియో.. ఇక సంచలనమన్నదే తన ఇంటి పేరు అని చెప్పకనే చెబుతుంది. తన పోటీ టెలికాం సంస్థలన్నీ రమారమిగా తన మాదిరిగానే ప్లాన్ ను రూపోందించి.. కస్టమర్లను అకర్షిస్తున్న క్రమంలో రిలయన్స్ జియో మరో అడుగు ముందుకేసి తన ప్రైమ్ కస్టమర్లకు మాత్రం ఇదివరకు ఏ టెలికాం సంస్థ ప్రకటించని విధంగా ట్రిఫుల్ క్యాష్ బ్యాక్ అపర్ ను ప్రకటించింది.
రూ. 399 అంతకంటే ఎక్కువ రీచార్జ్ చేసుకునే జియో ప్రైమ్ సభ్యులకు మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. రూ. 399తో రీచార్జ్ చేసుకున్న ప్రతిసారీ రూ.50 విలువైన 8 వోచర్లు ఖాతాదారుడి ‘మై జియో’ వాలెట్లో క్రెడిట్ అవుతాయి. తర్వాత రీచార్జ్ చేసుకునే సమయంలో ప్రతీసారి ఓ కూపన్ను వినియోగించుకోవచ్చు. అలాగే జియో భాగస్వామ్య మొబైల్ వాలెట్లు అయిన అమెజాన్ పే, యాక్సిస్ పే, ఫ్రీచార్జ్, మొబిక్విక్, పేటీఎం, ఫోన్పే వాలెట్లలో రూ. 300 విలువైన వోచర్లు క్రెడిట్ అవుతాయి.
అంతేకాక జియో ప్రైమ్ మెంబర్లు ఈ-కామర్స్ సైట్లలో షాపింగ్ చేస్తే రూ. 1,899 విలువైన ఓచర్లు లభిస్తాయి. ఫ్లైట్ టికెట్ల బుకింగ్పై డిస్కౌంట్ కూడా లభిస్తుంది. నేటి నుంచి ఈనెల 25 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. 15వ తేదీ నుంచి క్యాష్ బ్యాక్ ఓచర్లు కస్టమర్ల ఖాతాలో జమ అవుతాయి. అమెజాన్ పేలో రీచార్జ్ చేసుకునే వినియోగదారులకు రూ. 99 తక్షణ క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఇప్పటికే రీచార్జ్ చేసుకున్న వారికి రూ. 20 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. పేటీఎం రూ. 50 తక్షణ క్యాష్ బ్యాక్ ప్రకటించింది.
అలాగే ఫోన్ పే రూ. 75, మొబిక్విక్ రూ. 300, యాక్సిస్ పే రూ.100, ఫ్రీచార్జ్ రూ. 50 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నాయి. ఇప్పటికే ఈ యాప్లను ఉపయోగించి రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు అమెజాన్ రూ. 20, పేటీఎం రూ.15, ఫోన్ పే రూ. 30, మొబిక్విక్ రూ. 149, యాక్సిస్ పే రూ.35 వరకు వెనక్కి ఇవ్వనున్నాయి. ఈ-కామర్స్ సంస్థలు ఇచ్చే క్యాష్ బ్యాక్ ఓచర్లతో అజియో, యాత్రా డాట్ కామ్, రిలయన్స్ ట్రెండ్స్లలో షాపింగ్ చేయవచ్చని జియో తెలిపింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more