జమ్మూకాశ్మీర్ లోని పాకిస్తాన్ బోర్డర్ లో విధులు నిర్వహిస్తున్నాడు ఓ పోలీస్ అధికారి. అతని పేరు ఇష్ఫాక్ అహ్మద్. 2012 నుంచి పోలీస్ విభాగంలో పని చేస్తున్నాడు. సమర్ధుడైన అధికారిగా పేరు పొందాడు. బోర్డర్ లోని విధులు నిర్వహించే పోలీసులకే ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి ఎదిగాడు. మూడు నెలల క్రితం సెలవుపై వెళ్లాడు. రెండు నెలల తర్వాత అక్టోబర్ 23వ తేదీన విధుల్లో చేరాల్సి ఉన్నా.. అడ్రస్ లేదు. ఇంటికి సమాచారం ఇస్తే స్పందన లేదు.
అనూహ్యంగా వారం రోజుల క్రితం ఏకే 47 తుపాకీతో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాడు అహ్మద్. పోలీస్ జమ్మూకాశ్మీర్ పోలీస్ విభాగం మొత్తం షాక్ అయ్యింది. అహ్మద్ దగ్గర AK47 తుపాకీ ఉండటంతో అతను టెర్రరిస్ట్ గ్రూప్ లో చేరినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. లేదంటే ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే దానిపై ఆరా తీస్తున్నారు. కిడ్నాప్ అయినట్లు కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి కంప్లయింట్ లేకపోవటంతో.. స్వయంగానే తీవ్రవాదులతో కలిసినట్లు భావిస్తున్నారు. దీనిపై అత్యున్నత స్థాయిలో విచారణ చేపట్టారు ఉన్నతాధికారులు.
కతువా జిల్లాలోని పోలీస్ ట్రైనింగ్ సెంటర్ లో విధులు నిర్వహించే ఉద్యోగి కావటంతో.. కీలక సమాచారం టెర్రరిస్టులకు చేరే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు పోలీసులు. అహ్మద్ ది షోపియాన్ ప్రాంతంలోని హెఫ్ షిర్మల్ గ్రామం. అతడిని పట్టుకోవటానికి ప్రత్యేక బృందాలను నియమించినట్లు తెలిపారు సీనియర్ పోలీస్ అధికాది. ఆందోళనకరమైన అంశం ఏంటంటే.. ఇటీవల కాలంలో ఎనిమిది మంది పోలీసులు ఉద్యోగాలు వదిలేసి.. కాశ్మీర్ మిలిటెంట్లలో చేరటం చర్చనీయాంశంగా మారింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more