కేంద్రం అనుసరిస్తున్న నాన్చివేత ధోరణితో గత కొన్నేళ్లుగా తమ సమస్యలు ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారాయని.. ఇప్పటికైనా ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కారించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం దేశవ్యాప్తంగా పెట్రోట్ బంక్ డీలర్లు బంద్ లో భాగంగా ఇటు తెలంగాణ, అటు అంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పెట్రోల్ బంకులను బంద్ చేస్తున్నామని యునైటెడ్ ఫ్రంట్ పిలుపునిచ్చింది.
దీంతో శుశ్రవారం రోజున పెట్రోలు, డీజిల్ క్రయ, విక్రయాలను పూర్తిగా బంద్ చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ అమరం తెలిపారు. సమస్యల పరిష్కారానికి గత ఏడాది నవంబరులో కేంద్రం సుముఖత వ్యక్తం చేసి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసినా వాటిని అముల చేసి వర్తింపచేయడంలో మాత్రం ఇంకా నాన్చివేత ధోరణిని ప్రదర్శిస్తున్నాయని విమర్శించారు.
పెట్రోలియం వ్యాపారుల సమాఖ్య కర్ణాటక రాష్ట్ర అధ్యక్షుడు బీఆర్ రవీంద్రనాథ్ మాట్లాడుతూ.. కేంద్రం తమ డిమాండ్ పరిష్కారంపై తక్షణం దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ బంకుల్లో నష్టాలను తెలియజేస్తూ అధికారులతో జరిగిన చర్చల్లో అందరూ సానుకూలంగా స్పందించినా... అమల్లోకి మాత్రం రావడంలేదన్నారు. పెట్టుబడులపై రాబడులతో పాటు ప్రతీ ఆరు నెలలకు డీలర్ల మార్జిన్ల సమీక్ష, మానవ వనరుల పెంపు, పెట్రోలియం ఉత్పత్తుల నిర్వహణ నష్టాలపై అధ్యయనం తదితర అంశాల పరిష్కారానికి ఓఎంసీలు అంగీకరించాయి. అయితే వాటిలో ఏ ఒక్కదాన్ని పరిష్కరించలేదు’ అని చెప్పారు.
మూడు చమురు సంస్థల డీలర్లందరూ యునైటెడ్ పెట్రోలియం ఫ్రంట్గా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించామన్నారు. గురువారం అర్ధరాత్రి నుంచి శుక్రవారం అర్ధరాత్రి వరకు 24 గంటలపాటు బంకుల్లో పెట్రోలు, డీజిల్ క్రయ, విక్రయాలను నిలుపుదల(బంద్) చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ నెల 27 నుంచి నిరవధికంగా పెట్రోలు బంకులను మూసివేయాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. పెట్రోలు, డీజిల్ను కూడా జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more