ఇప్పటికే యావత్ భారతం భారీ వర్షాలకు తడిసి ముదై.. జనజీవనం స్థంభించింది. అయితే ఇదే సమయంలో ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి తీవ్ర వాయుగుండంగా మారి.. వర్షాలు కురిపించేందుకు తాను వచ్చేస్తున్నానూ అన్న సమాచారంతో తీరప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలతో ప్రజలు తమ దైనందిక పనులు చేసుకోలేక అవస్థలు పడుతుండగా, నేనూ రెడీ అన్న వార్తలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.
అయితే తీవ్రవాయుగుండం ప్రభావం తెలుగు రాష్ట్రాలపై వుండదని వాతావరణ శాఖ స్పష్టం చేసినా.. భారతావనిలోని పశ్చిమ బెంగాల్ పై మాత్రం తీవ్ర ప్రభావం చూపుతుందని సమాచారం. కోల్కతాకు 50 కిలోమీటర్లు ఉత్తర వాయవ్యంగా కేంద్రీకృతమైన తీవ్ర వాయుగుండం వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఉత్తర వాయవ్యంగా పయనించి వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ తెలిపింది.
ఇదిలావుండగా, మధ్యప్రదేశ్ నుంచి విదర్భ, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకూ ఉపరితలద్రోణి కొనసాగుతుంది. దీని ప్రభావంతో తెలుగు రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో మంగళవారం ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో తెలంగాణలో ఎక్కువచోట్ల, రాయలసీమ, కోస్తాల్లో పలుచోట్ల ఉరుములతో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ అతలాకుతలం.. శివార్లో అత్యధిక వర్షపాతం
సోమవారం తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరం సహా శివార్లలో వరుణుడు భీభత్సం సృష్టించాడు. ఇప్పటికే గత పక్షం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఇంకా నగరంలోని అనేక ప్రాంతాలు జలదిగ్భంధంలోనే వుండగా, సోమవారం కురిసిన వర్షంతో నగరవాసులు అందోళనకు గురయ్యారు. మరీ ముఖ్యంగా బీహెచ్ఈఎల్ రామచంద్రాపురంలో అత్యధిక వర్షాపాతం నమోదైంది. సోమవారం సాయంత్రం ఐదు గంటల సమయం నుంచి రాత్రి 12గంటల వరకు ఎడతెరపి లేకుండా భారీగా వర్షం కురిసింది.
సోమవారం రాత్రి కురిసిన వర్షాపాతం వివరాలిలా ఉన్నాయి. రామచంద్రాపురంలో 8.3, మాదాపూర్లో 6.7సెంటిమీటర్ల వర్షాపాతం నమోదైంది. అలాగే పాశమైలారంలో 5.4సెం.మీ, తిరుమలగిరిలో 4.7, మల్కాజ్ గిరిలో 4.1, రాజేంద్రనగర్లో 3.9 సెం.మీ వర్షాపాతం నమోదైంది. ఇక గోల్కొండలో 3.7, బేగంపేటలో 3.6, జూబ్లీహిల్స్ లో 3.5సెం.మీ, వెస్ట్ మారేడ్ పల్లిలో 2.6 సెం.మీ, మైత్రివనంలో 2, మోండామార్కెట్లో 1.5 సెం.మీ వర్షపాతం నమోదైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more