పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ (జేఈఎం)కు కొలుకోలేని దెబ్బ తగిలింది. అక్రమంగా దేశంలోకి చోచ్చుకోచ్చి.. కాశ్మీర్ ప్రాంతంతో మరీ ముఖ్యంగా ఉత్తర కాశ్మీర్ లోని బారముల్లా ప్రాంతంలో అలజడులకు ప్రధాన కారణంగా మారిన ఆపరేషనల్ హెడ్ ఖలీద్ ను ఇవాళ భారత భద్రతా బలగాలు హతమార్చాయి. బారాముల్లాలోని లదూరా ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారని సమాచారంతో రంగంలోకి దిగిన భద్రతా బలగాలు కార్డన్ సర్చ్ నిర్వహించాయి. ఈ నేపథ్యంలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య కాల్పులు జరిగాయి.
ఈ సందర్భంగా జైషే మెహమ్మద్ అపరేషన్ హెడ్ ఖలీద్ కూడా ఉగ్రవాద ముఠాలో వుండగా, ఇరువర్గాలకు మాధ్య కొంతసేపు పోరు సాగింది. అయితే భారత బలగాలు ఉగ్రవాదులపై పైచేయి సాధించాయి. భారత బలగాల కాల్పుల్లో ఖలీద్ కూడా తీవ్రంగా గాయపడ్డాడు. అయితే గాయపడిన ఖలీద్ అక్కడి నుంచి పారిపోయేందుకు యత్నించి.. స్థానికంగా వున్న ఓ భవనంలోకి చోరబడ్డాడు. ఈ క్రమంలో భాదర భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఖలీద్ దుర్మరణం చెందాడని పోలీసు వర్గాలు తెలిపాయి.
పాకిస్థాన్ లో శిక్షణ పొంది భారత్ లోకి చొరబడిన ఖలీద్ నార్త్ కశ్మీర్ లో ఉగ్ర కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నట్లు సమాచారం. 2016 అక్టోబర్లో బారాముల్లాలో జైషే మొహమ్మద్ ఉగ్రవాదులపై దాడి చేసిన భద్రతా బలగాలకు ఖలీద్ గురించి తెలిసింది. అయితే గత అగస్టు నెలలో జైషే ఫిద్దాయూన్ భారత సెక్యూరిటీ బలగాలపై జరిపి తొమ్మిది మంది మరణానికి కారణమైయ్యాడు. ఇదిలావుండగా, కాశ్మీర్ లోని షోఫియాన్ జిల్లాలో కూడా ఇద్దరు ఉగ్రవాదులు ఓ భవనంలో తలదాచుకున్నారు. భద్రతా దళాలు ఆ భవనాన్ని చుట్టుముట్టాయి. అందులో ఇద్దరు ఉగ్రవాదలు వున్నట్లు సమాచారం. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more