ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను తీసుకురావాల్సిన బాధ్యత తన మిత్రపక్ష పార్టీగా అధికార పీఠమెక్కిన కేంద్రంలోని బీజేపి కన్నా.. రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలకు అధిక బాధ్యత వుందని గతంలో అనేక పర్యాయాలు అన్నారు. ఇక ఎంపీలకన్నా అధికాంగా కేంద్రంలో మంత్రి పదవులను చేపట్టిన కేంద్రమంత్రులు ఈ భాధ్యతను తమ భుజాలపై వేసుకోవాలని, లేదంటే తమ మంత్రపదవులను త్యాజించి ఉద్యమంలోకి రావాలని కూడా అన్నారు. అయితే ఇన్నాళ్లు మనౌంగా వున్న టీడీపీ నేతలు పవన్ కల్యాన్ పై నోరుజారారు.
ఈ విషయం తాజాగా తన దృష్టికి వచ్చిన పవన్ కల్యాన్.. తన మనస్సులోని మాటలను రెండు ముక్కల్లో తన అభిమానులకు తెలియజేశారు. అదీ సామాజిక మాధ్యం ట్విట్టర్ ద్వారా. అంతే ఇక ఆ ట్వీట్ ఒక్కసారిగా వైరల్ అవుతుంది. అయితే ఏపీకి పత్ర్యేక హోదా డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో బహిరంగ సభలు నిర్వహించిన ఆయన అ సమావేశాల సందర్భంగా ప్రస్తావించిన నేతల పేర్లను మరోమారు ప్రస్తావిస్తూ ట్విట్ చేశారు. తన తాజా ట్విట్ లో కేంద్రమంత్రి, రాష్ట్రమంత్రుల పేర్లను పేర్కోడంతో ప్రకంపనలు రేపుతున్నారు. ఇంతకీ వారెవరూ..? పవన్ కల్యాన్ ట్విట్ లో వారినేమన్నారు..? అంటే..
వారిలో ఒకరు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు, మరోకరు రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ. ఇక పవన్ ట్విట్ ఇలా సాగింది. `అశోక్ గజపతి రాజు గారికి పవన్ కల్యాణ్ ఎవరో తెలియదు.. మంత్రి పితాని గారికి పవన్ కల్యాణ్ ఏంటో తెలియదు.. సంతోషం` అని పేర్కొన్నారు. రానున్న ఎన్నికలలో పూర్తిస్థాయిలో క్రీయాశీలక రాజకీయాల్లోకి వస్తున్న జనసేన అధినేత.. ఇలా ట్విట్ చేయడంపై అభిమానులు, పార్టీ క్రీయాశీలక కార్యకర్తలు కూడా అండగా నిలుస్తూ విపరీతంగా రీట్వీట్ చేస్తున్నారు.
’వాళ్లు మీ దగ్గరికి వచ్చి తమను తామే పరిచయం చేసుకునే రోజు త్వరలో వస్తుంది అన్నా!`, అంటూ కొందరు ప్రతిస్పందిస్తే… `నువ్వేంటో చూపించే టైమ్ వచ్చింది అన్నా!` అంటూ మరికోందరు.. తెలుగు రాష్ట్రాలలో పాపులర్ హీరోను.. గత ఎన్నికలలో ఆ పార్టీకి అధికారం అందించిన వ్యక్తిని.. మోడీ, చంద్రబాబులు వున్న వేదికలపై జనమోదం తమ కరతాళధ్వనులతో ఎవరి ప్రసంగానికి హర్షం వ్యక్తం చేశారో.. అలాంటి నేతనే వారు తెలియదంటే.. ఇక సాధారణ ప్రజలను, కనీసం నియోజకవర్గంలోని ఓటర్లను కూడా వారు గుర్తుపట్టే స్థితిలో లేనట్లే అని ఇంకోందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more