నేరప్రవృత్తి అనువనువునా వున్నవారు ఎంతటి కపట నాటకాలకు తెరతీస్తారో ఈ ఘటనలో అర్థమైవుతుంది. యువతితో పరిచయం చేసుకుని తామిక స్నేహితులం అయ్యామని ప్రతినిత్యం మాట్లాడుతారు. ఆ తరువాత ఆ పరిచయాన్ని ప్రణయానికి దారితీసేలా చేస్తారు. ఆనక పెళ్లి చేసుకుంటామని నమ్మించి యువతిని అపహరించి.. నిర్భంధించి.. అమెపై అత్యాచారం చేస్తారు. ఇది ఎక్కడో నిర్జన ప్రాంతంలోకాదు ఏకంగా జనసామార్థ్యం వున్న జనారణ్యంలోనే జరిగిన ఘటన.
బాధితురాలు బయటపడటానికి కారణం నిందితుడి భార్యే కావడం గమనార్హం. హైదరాబాద్ మాదన్నపేట ప్రాంతంలోని సంతోష్ నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. సహజీవనం చేసిన యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి నిందితుడు అమెను ఓ గదిలో నిర్భంధించి గత వారం రోజులగా ప్రతిరోజు అమెపై అత్యాచారం చేశాడు. నిందితుడి భార్య సహకారంతో తప్పించుకున్న బాధితురాలు నేరుగా సంతోష్ నగర్ పోలీసులను అశ్రయించి పిర్యాదు చేయడంతో ఘటన వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళ్లే.. సంతోష్ నగర్లో నివసిస్తున్న మిస్బాఉద్దీన్ (32)కు మధ్యప్రదేశ్ లోని ఓ ఫుడ్స్ సంస్థలో సేల్స్ మేనేజర్ గా పనిచేస్తున్న యువతితో పరిచయం ఏర్పడింది అది క్రమంగా స్నేహంగా మారింది. ఆ తరువాత ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. 2017 ఏప్రిల్లో ఆమెను హైదరాబాద్ కు పిలిచి మెహిదీపట్నంలో సహజీవనం చేశాడు. మిస్బాఉద్దీన్ భార్యకు విషయం తెలిసి.. బాధితురాలికి.. తన గురించి, తమ పిల్లల గురించి చెప్పింది.
వివాహితుడినా.. తాను ప్రేమించిందని.. అవేదన చెందిన బాధితురాలు.. మిస్బావుద్దీన్ తో గొడవ పడి తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్ కు వెళ్లిపోయింది. అయితే తాను తన భార్యకు విడాకుల్చి వేరుగా వుంటున్నానని నమ్మబలికి ప్రియురాలని మళ్లీ హైదరాబాద్ కు రప్పించిన మిస్బాఉద్దీన్.. భార్య పుట్టింటికి వెళ్లడంతో సంతోష్ నగర్ ఇంటిలోనే ఆమెను వారం పాటు ఒక గదిలో బంధించి అత్యాచారం చేశాడు. భార్య వచ్చిన తరువాత ఆమె సహాయంతో బాధితురాలు తప్పించుకుని పోలీసులకు పిర్యాదు చేసింది. మిస్బాఉద్దీన్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిపై మోసం, నిర్బంధం, అత్యాచారం కేసులను నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more