హిమాచల్ ప్రదేశ్ లోని మండీ-పఠాన్కోట్ జాతీయ రహదారిపై కొట్రుపి వద్ద కొండచరియలు విరిగి పటడంతో సంభవించిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. సోమవారం ఉదయం వరకు ఈ ప్రమాదంలో 60 మంది అసువులు బాసారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ దుర్ఘటనలో క్రితం రోజు రాత్రి వరకు 46 మృతదేహాలను వెలికితీసిన సహాయక బృందాలు వెలికి తీశాయి. అయితే వారిలో 23 మందినే గుర్తించగలిగారు. మిగిలినవారిని గుర్తించడానికి ఫోరెన్సిక్ నిపుణుల్ని రంగంలో దించారు. 12 మంది క్షతగాత్రుల్ని మండీలోని ఆసుపత్రులకు తరలించారు.
కొట్రుపి వద్ద రెండు బస్సుల్లోని ప్రయాణికులు టీ తాగేందుకు బస్సును నిలిపిన సమయంలో ఈ ఘటన సంభవించింది. ఈ దుర్ఘటనలో ఒక వాల్వో బస్సు మనాలీ నుంచి కాట్రాకు, రెండోది మనాలీ నుంచి చాంబాకు వెళ్తూ కొట్రుపి వద్ద అగాయి. ఈ రెండు బస్సులతో పాటు మరో కారు కూడా అక్కడ నిలిపివుంది. కుండపోతగా కురిసిన వర్షం తీవ్రతకు 250 మీటర్ల విస్తీర్ణం ఉన్న కొండచరియలు విరిగిపడటంతో.. ఆ ధాటికి బస్సులు పక్కనున్న లోయలోకి సుమారు 800 మీటర్ల లోతున్న లోయలోకి జారిపోవడంతో మృతుల సంఖ్య పెరుగుతోంది.
జాతీయ విపత్తు ఉపశమన దళం (ఎన్డీఆర్ఎఫ్), జమ్ము నుంచి తరలి వచ్చిన సైనిక బలగం కూడా రంగంలో దిగి సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. మరిన్ని కొండచరియలు విరిగి పడవచ్చనే భయంతో ఆదివారం రాత్రి నుంచి గాలింపు చర్యలు నిలిపేశారు. కొట్రుపిలో స్థానికులు తమ ఇళ్లువాకిళ్లను వదిలి అడువుల్లోకి పరుగులు తీసి తలదాచుకున్నారు. మృతదేహాలకు సంఘటన స్థలంలోనే పోస్టుమార్టం పరీక్షలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అదేశించింది. హిమాచల్ ఈ భారీ ప్రాణనష్టం చేకూరేలా ఇలాంటి ఘటనలు సంభవించడం ఇది మూడోసారి.
కాగా ఈ దుర్ఘటనలో ఇద్దరు తెలంగాణ వాసులు కూడా ప్రాణాలను కొల్పోయారు. యాదాద్రి జిల్లా భువనగిరి, నల్గోండ జిల్లాలకు చెందిన జంపల్లి వాసి కొంతం రాజిరెడ్డి, నార్కట్ పల్లి మండలం ఔరవాణి గ్రామానికి చెందిన దుబ్బాక కొండల్ రెడ్డిలు తమ ఉద్యోగ బాధ్యత్తలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ వెళ్లి.. ప్రాణాలను కొల్పోయారు. వీరిద్దరూ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంస్థల్లో మేనజర్లుగా పరిచేస్తున్నారని, ఉద్యోగ విధుల్లో భాగంగా కొట్రుపి వెళ్లిన వీళ్లు ప్రమాదం బారిన పడి ప్రాణాలను కోల్పోయారని సమాచారం అందిందని గ్రామస్థులు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more