వరుసగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ బీజేపి పార్టీ నేతలు వార్తల్లో నిలుస్తున్నారు. అడవారికి అర్థరాత్రిళ్లు ఏం పని అంటూ నిలదీసిన బీజేపి హర్యానా ఉపాధ్యక్షుడి ఘటనను మరువక ముందే.. మరో బీజేపి మంత్రి ఏకంగా ప్రజలకు ప్రభుత్వానికి మద్యన నిలిచే వారధులను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు పార్టీ నేతలు అనవసరంగా నోరు జారకూడదు అంటూ పార్టీ అధిష్టానం అదేశాలను ఇస్తూనే నేతలు మాత్రం తమకు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.
ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అని పెద్దలంటారు. కేవలం మీడియా ముఖ్యంగా నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటుకోవాలంటే అది ఎంతవరకు సముచితం. దేశభక్తి అన్నది నినాదాలతో రుజువు చేసుకునేది కాదు.. దేశం కోసం మనం ఏం చేశామన్నదానిపై అధారపడి వుంటుంది. దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని అన్నట్లుగా దేశం కోసం నినదించడం కాన్నా దేశంలోని కడుపేదల కడుపు నింపేవాడు గోప్పవాడదని మరవులేని సత్యం. బీహార్ మంత్రి, బీజేపీ నేత వినోద్ కుమార్ ఇలా వ్యవహరించి.. తాను అశించిన మేరకు స్పందన రాకపోవడంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మీడియా ప్రతినిధులు పాకిస్తానీలంటూ వ్యాఖ్యలు చేశారు. బీజేపి పార్టీ అధ్వర్యంలో నిర్వహించిన సంకల్ప్ సమ్మేళన్ కార్యక్రమంలో సహనం కోల్పోయిన ఆయన ఈ కామెంట్లు చేశారు. బీహార్ లో బీజేపి మద్దతుతో ఏర్పడిన జేడీ(యూ) ప్రభుత్వంలో ఈ సీనియర్ నేతను పార్టీ అధిష్టానం గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు అప్పగించింది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఒక్కసారిగా భారత్ మాతా కీ జై అంటూ నినందించారు. అయితే అక్కడే ఉన్న మీడియా ప్రతినిధుల నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంతో అసహనానికి గురైన ఆయన మీరు పాకిస్థాన్ మాతాకి మద్దతుదారులేనంటూ ఆగ్రహాం వెళ్లగక్కారు.
ఆయన కామెంట్లపై జర్నలిస్టులు నిరసన వ్యక్తం చేయగా, మిగతా వారెవరూ పట్టించుకోకపోవటం గమనార్హం. ఇక ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బిహార్ బీజేపీ అధ్యక్షుడు నిత్యానంద్ రాయ్ మసీదుల్లో ఆజాన్, చర్చిల్లో గంటల శబ్ధాలకు బదులు భారత్ మాతాకీ జై నినాదాన్ని వినిపించాలంటూ సంచలన ప్రకటన చేశారు. అయితే కాసేపటికే తాను అలా చెప్పలేదని పేర్కొనటం విశేషం. ఇక వీటిపై జేడీయూ అధికార ప్రతినిధి రాజీవ్ రంజన్ స్పందిస్తూ అది పూర్తిగా వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ అని తెలిపారు.
కాగా వివాదం పెద్దగా మారడంలో నాలుక కర్చుకున్న మంత్రి వినోద్ కుమార్ సింగ్ తాను తన జీవితంలో ఇప్పడి వరకు ఎవరినీ కించపరుస్తూ, అవమానపరుస్తూ వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. భారత్ మాతాకి జై అన్న అంశమై తన స్టాండును అలాగే కొనసాగించిన మంత్రి, తాను మాట్లాడింది మాత్రం తప్పుగా అర్థం చేసుకుని.. మీడియా వివాదాస్పదం చేసిందని పేర్కోన్నారు. తాను మాట్లాడిన వీడియో చూస్తూ తన సెంటిమెంట్లు తప్పుకావని అన్నారు. మీడియా మిత్రుల సెంటిమెంట్లను అగౌరవపర్చానని భావించరాదని క్షమాపణలు చెప్పారు, తనకు మీడియా మిత్రులంటే చాలా గౌరవమని పేర్కొన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more