ప్రపంచ అత్యంత పెద్ద బ్యాంకుల్లో ఒకటైన స్టేట్ బ్యాంకు అప్ ఇండియా తీసుకున్న నిర్ణయమే ఇప్పుడు మిగతా బ్యాంకులు కూడా తీసుకునేందుకు కారణమవుతున్నాయి. ఎస్టీఐ కోత మార్గంలో పయనించడాన్ని అన్ని బ్యాంకులు స్వాగతిస్తూ.. అదే మార్గంలో పయనించేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో ఖాతాదారులు షాక్ కు గురై బెండేలెత్తిపోతున్నారు. సేవింగ్స్ అకౌంట్లపై గత కొన్నాళ్లుగా ఖాతాదారులు అందుకుంటున్న వడ్డీరేట్లను తొలుత ఎస్బీఐ తగ్గించగా.. తాజాగా అదే బాటలో అటు జాతీయ, ఇటు ప్రైవేటు బ్యాంకులు కూడా పయనిస్తున్నాయి.
జులై 31న ప్రభుత్వ రంగ సంస్థ భారతీయ స్టేట్ బ్యాంకు తొలుత పొదుపు ఖాతా వడ్డీ రేట్లను తగ్గించగా తాజాగా ప్రైవేటు రంగ బ్యాంకులు కూడా అదే బాటలో నడుస్తున్నాయి. ఎస్బీఐ తరువాత అఘమేఘాల మీద బ్యాంక్ అఫ్ బరోడా బ్యాంకు కూడా సేవింగ్స్ అకౌంట్ల వడ్డీలపై కొతను విధిస్తున్నట్లు ప్రకటించింది. ఇక ఆ తరువాత కొటక్ మహింద్రా బ్యాంకు కూడా అదే మార్గంలో పయనించినా.. భిన్నమైన విధానాన్ని ప్రకటించింది. లక్ష నుంచి కోటి రూపాయల వరకు చెల్లించే వడ్డీని యధాతథంగా కొనసాగిస్తూనే కోటి నుంచి ఐదు కోట్ల వరకు వున్న అకౌంట్ల వడ్డీని మాత్రం ఆరు నుంచి ఐదున్నర శాతానికి తగ్గించింది.
ఇక తాజగా యాక్సిస్ బ్యాంకు కూడా ఎస్బీఐ బాటలోనే పయనించింది. రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై 50 బేస్ పాయింట్ల కోత విధిస్తూ 3.50 శాతం వార్షిక వడ్డీని అందించనున్నట్టు తెలిపింది. రూ.50 లక్షలు, ఆ పైన మొత్తాలు కలిగిన డిపాజిట్లకు మాత్రం 4 శాతం వడ్డీ కొనసాగుతుందని వివరించింది. కాగా, రూ.కోటి కంటే తక్కువ డిపాజిట్ కలిగిన ఖాతాలకు 3.5 శాతం, ఆ పైన డిపాజిట్లకు 4 శాతం వార్షిక వడ్డీ అందించనున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. ఎస్బీఐ ప్రకటన 90 శాతం మంది ఖాతాదారులపై ప్రభావం చూపనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా ఎస్బీఐని అనుసరిస్తూ రూ.50 లక్షల లోపు డిపాజిట్లపై వడ్డీ రేటును 3.5 శాతానికి తగ్గించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more