PM Modi to kick off Hyderabad metro rail next year మెట్రో కూతకు వేళయరా..! ప్రధాని చేతుల మీదుగా

Hyderabad metro operational date fixed pm modi to kick off

hydeerabad metro rail, hyd metro rail, hyd metro rail kick off jan 3rd, hyd metro rail pm modi, hyd metro rail kcr, hyd metro rail january, metro-rail, hyderabad, urban, rail, operational, january, pm modi, inaugurate, kick off, telangana, kcr

Telangana government invites Prime Minister Narendra Modi to inaugurate Hyderabad Metro rail, which becomes operational on january 3rd.

మెట్రో కూతకు వేళయరా..! ప్రధాని చేతుల మీదుగా

Posted: 08/09/2017 10:51 AM IST
Hyderabad metro operational date fixed pm modi to kick off

హైదరాబాద్ వాసుల ట్రాపిక్ కష్టాలకు అందుబాటులోకి వచ్చిన ఓ చక్కని పరిష్కారం త్వరలో అవిష్కృతం కాబోతుంది. గత అరేడేళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ వాసులకు ఇదిగో అదిగో అంటూ ఎప్పటికప్పుడు అశలు కల్పిస్తూనే.. వాయిదాలతొ కాలం గడిసేస్తంది. అయితే ఇన్నాళ్లుగా కళ్లు కాయలు కాచేలా ఎదురుచూసిన నగరవాసుల కల ఎట్టకేలకు ఫలించబోతోంది. హైదరాబాద్ మెట్రో రైలు పరుగుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదాలు వేసుకున్న నేపథ్యంలో ఈసారి డేట్ ను కూడా ఫిక్స్ చేసేసింది మెట్రో రైలు సంస్థ.

నూతన సంవత్సర కానుకగా, సంక్రాంత్రి పర్యదినానన్ని పురస్కరించుకుని వచ్చే ఏడాది జనవరి 3వ తేదీని మెట్రో రైలు కూతకు సిద్దం అవుతుంది. నగరవ్యాప్తంగా మొత్తం రైలు మార్గం పూర్తైన తరువాతే దానిని వినియోగంలోకి తీసుకువస్తామని గతంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. అయితే అందుకు భిన్నంగా కేవలం రైలు మార్గంలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సంపూర్ణంగా పనులు పూర్తైన మియాపూర్-అమీర్ పేట్, నాగోల్, బేగంపేట్ కారిడార్లలోనే మెట్రో రైలు కూతలు వినిపించనున్నాయి. ఆ తరవాత మెట్రో సేవలను క్రమంగా విస్తరించనున్నారు. మెట్రో రైలు సేవలను హైదరాబాద్ వాసులకు అందుబాటులోకి తీసుకురానున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఆయన ఈ మెట్రో సేవలను జనవరి 3న ప్రారంభించనున్నారు.

జనవరి నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ మెట్రో రైలును ప్రారంభించాలని యోచిస్తున్న ప్రభుత్వం పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఆదేశించింది. ఈ కారణంగానే నగరంలో పనులు ఊపందుకున్నాయి. ఎక్కడికక్కడ రోడ్లు బ్లాక్ చేసి, ట్రాఫిక్‌ను మళ్లించి మరీ రాత్రీపగలు తేడా లేకుండా పనులు చేస్తున్నారు. అమీర్‌పేట, సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటా బ్రిడ్జి వద్ద ట్రాఫిక్‌ను దారి మళ్లించి పనులు పూర్తి చేస్తున్నారు. ఒలిఫెంటా వద్ద  ఏర్పాటు చేస్తున్న ఉక్కు వంతెన నిర్మాణం పూర్తయితేనే నాగోలు నుంచి బేగంపేట మార్గంలో రైలు నడిపే అవకాశం ఉంది.

నవంబరు కల్లా మిగిలిన పనులు పూర్తి చేసి డిసెంబరులో ట్రయల్స్ నిర్వహించి జనవరిలో ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. అమీర్‌పేట వద్ద రైలు మార్పిడి స్టేషన్ నిర్మించాల్సి ఉంది. దీని నిర్మాణాన్ని కొనసాగిస్తూనే మియాపూర్-అమీర్‌పేట మధ్య రైలు నడపాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తోంది. కాగా, నగరంలోని మిగతా రూట్లలోనూ నిర్మాణ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం మూడు కోచ్‌లతో ఉన్న 53 మెట్రో రైళ్లు నగరానికి చేరుకున్నాయి. మెట్రోరైలు ప్రారంభోత్సవానికి ప్రధాని  నరేంద్రమోదీని ముఖ్యమంత్రి  కేసీఆర్ ఇప్పటికే ఆహ్వానించినట్టు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : metro-rail  hyderabad  urban  rail  operational  january  pm modi  inaugurate  kick off  telangana  kcr  

Other Articles