రాజస్తాన్ బీజేపి పార్టీలో విషాదం అలుముకుంది. ఆ పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రి, అజ్మీర్ పార్లమెంటు సభ్యుడు సన్వర్లాల్ జాట్ ఇవాళ తెల్లవారు జామున కన్నుమూశారు. గత పక్షం రోజులుగా ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ నీటివనరుల సహాయ మంత్రిగా ఆయన గత రెండేళ్లు సేవలందించారు. కాగా ఇటీవల జరిగిన మంత్రివర్గం విస్తరణలో ఆయన పదవిని కొల్పోయారు. ఆ మనోవేధన కూడా ఆయన మరణానికి కారణం అయ్యివుండవచ్చన్న వార్తలు వినిపిస్తున్నాయి.
గత నెలలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అధ్యక్షతన నిర్వహించిన సభలో ఆయన వేదికపైనే కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను జైపూర్లోని సవాయ్ మాన్ సింగ్(ఎస్ఎంఎస్) ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడి వైద్యులు ఎన్ని విధాలుగా చికిత్స చేసినా ఆయన అందుకు స్పందించడం లేదని.. ఆయన కోమా నుంచి బయటకు వస్తే కానీ ఆయన పరిస్థితి ఏంటని చెప్పలేమని చెప్పిన అస్పత్రి సూపరింటెండెంట్ మీనా ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్ అసుపత్రికి తరలించాలని సూచించడంతో జాట్ కుటుంబసభ్యులు ఆయనను ఢిల్లీ ఎయిమ్స్లో చేర్చారు.
అక్కడ కూడా గత పక్షం రోజులుగా వైద్యులు అన్ని పరీక్షలు చేస్తున్నా.. ఆయన శరీరం చికిత్సలకు స్పందించలేదు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ తెల్లవారు జామున కన్నుమూశారు. సన్వర్లాల్కు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. సన్వర్లాల్ 1955, జనవరి 1న అజ్మీర్లో జన్మించారు. ఎంకామ్, పీహెచ్డీ చేసి ప్రొఫెసర్గా పనిచేశారు. తర్వాత బీజేపీలో చేరి కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగారు. రాజస్థాన్ మంత్రిగానూ పనిచేశారు. నరేంద్ర మోదీ మంత్రివర్గంలో 2014 నుంచి 2016 వరకు జలవనరుల సహాయ మంత్రిగా ఆయన పనిచేశారు. రాజస్థాన్ కిసాన్ ఆయోగ్ చైర్మన్గానూ ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more