భూమిని దుక్కడం రాదు.. దున్నడం అంతకన్నా తెలియదు.. విత్తనాలు చల్లుడు రాదు.. నాట్లు వేయడం అసలే తెలియదు.. కోతలు కోయడం రాదు.. కళ్లెం చేయడం తెలియదు.. కానీ వారంతా రైతులే. ఇది మన భారత దేశ రైతాంగ జాబితా. అవునండీ నిజమే. దేశంలో రైతులకు మాత్రమే చెందాల్సిన ఏ పథకమైనా వుంటే.. పైన చెప్పిన వాటిలో ఏ క్వాలిఫికేషన్ వున్న అందుకు అర్హులు కాదంటే నమ్మండి. ఓ వైపు ప్రధాని నరేంద్రమోడీ తమ ప్రభుత్వం గతానికి పూర్తి భిన్నంగా అర్హులైన లబ్దిదారులకు నేరుగా పథకాలు అందిస్తున్నామని ప్రచారం చేస్తున్న క్రమంలోనే అదే బీజేపి పాలిత రాష్ట్రంలో జరుగుతున్న తంతు వింటే అవ్వాక్కవక తప్పదు.
మధ్యప్రదేశ్ లోని శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గంలో రాష్ట్ర ఉద్యానవన, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా వున్న సూర్య ప్రకాష్ మీనాను తక్షణం మంత్రివర్గం నుంచి భర్తరఫ్ చేయాలని మధ్యప్రదేశ్ రైతు సంఘం విచార్ మధ్యప్రదేశ్ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మంత్రిగారు చేసిన నిర్వాకం అలస్యంగా వెలుగుచూడటంతో ఆయనపై ఆ రాష్ట్ర రైతాంగం అగ్రహంగా వున్నారు. ముఖ్యమంత్రి ఆయనను తక్షణ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఎనమిది నెలల క్రితం మధ్యప్రదేశ్ కు చెందిన 24 మంది రైతులను విదేశాలలోని వ్యవసాయ విధానాలను అద్యయనం చేయడానికి పంపింది. రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన నేపథ్యంలో నిజమైన రైతులు, ఉద్యాన వనాలపై అసక్తి వున్నవారి జాబితాను సిద్దం చేసింది. అయితే రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది పోటీ పడగా, అందులోంచి కేవలం 24 మందికి మాత్రమే అవకాశాన్ని కల్పించింది సర్కార్జ. అయితే హోల్కాండ్ లోని ఉద్యానవనాల అద్యయనానికి వీరిని పంపింది. కాగా ఈ రైతుల జాబితాలో ఏకంగా మంత్రివర్యుల కుమార రత్నం తో పాటు జామాత కూడా వుండటం గమనార్హం.
ఈ విషయం తాజాగా వెలుగులోకి రావడంతో మంత్రి సూర్య ప్రకాష్ మీనాను తక్షణం బర్తర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అయితే మంత్రివర్యులు మాత్రం తన కొడుకు, అల్లుడిని వెనకేసుకొస్తున్నారు. వాళ్లు కూడా రైతులని, వ్యవసాయం చేస్తున్నారని, అదే హోదాలో హాల్యాండ్ కు వెళ్లారే తప్ప మరేవిధమైన తప్పిదానికి అస్కారం లేదని చెప్పారు. కాగా విచార్ మధ్యప్రదేశ్ కోఅర్డినేటర్ అక్షయ హుంకా మాత్రం మంతి చర్యలను తీవ్రంగా దుయ్యబట్టి.. రైతులు హక్కుల విషయంలో రాజీపడి తన కొడుకును, అల్లుడిని వెనకేసుకు రావడం హేయకరమని విమర్శించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more