ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి సాక్షిగా మంత్రి అయ్యన్నపాత్రుడికి పరాభవం జరిగింది. ఇది కావాలని జరిగిందా..? లేక కాకతాళీయంగా జరిగిందా..? అన్న విషయం తెలియదు కానీ.. తన రాజధానిలో ఓ మంత్రికి తాను మంత్రిని అనుమతించండీ అని చెప్పుకోవాల్సిన దుర్భర పరిస్థితి రావడం మాత్రం ఆక్షేపనీయం. కానీ అదే జరిగింది. ఏదో మారుమూల ప్రాంతంలో లేక రాష్ట్రం కాని రాష్ట్రంలో ఇలాంటి ఘటనలు జరిగితే అర్థం చేసుకోవచ్చు.. కానీ సొంత రాష్ట్రంలో అమాత్యులకే అవమానం జరిగితే.. ఎవరినీ అడగాలి..? అసలు ఆ మంత్రి తన అవేధనను ఎవరికి చెప్పుకోవాలి.
ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి మంత్రి అయ్యన్నపాత్రుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. స్టేజీజైకి వెళ్లేందుకు వెళ్తున్న మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది అడ్డుకున్నారు. ఆయనను అడిటోరియం లోనికి వెళ్లనీయకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులే అడ్డుకున్నారు. తనకు ఎదురైన వింత పరిస్థితికి ఖంగుతిన్న మంత్రి తాను.. ఆంధ్రప్రదేశ్ మంత్రినని చెప్పుకోవాల్సి వచ్చింది. అయినా వారు లోనికి అనుమతించలేదు. బారికేడ్లు తొలగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు.
అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్ ...మంత్రి అయ్యన్నకు ఫోన్ చేసి.. కార్యక్రమానికి హాజరుకావాల్సిందిగా కోరారు. అయితే ఆందుకు ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. ఇది మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన నేపథ్యంలో ఇలా ప్రతీకారేచ్ఛ తీర్చుకున్నారని భావిస్తున్నారు. కాగా అయ్యన్న మాత్రం...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more