ప్రపంచ వ్యాప్తంగా అనేకమంది కస్టమర్లను అకర్షిస్తూ.. అతిపెద్ద కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజంగా వెలుగొందుతున్న సామ్ సంగ్.. తన వినియోగదారులకు మరో శుభవార్తను అందించింది. జీఎస్టీతో దేశవ్యాప్తంగా ఏకీకృత పన్నువిధానం అమల్లోకి రావడంతో.. ఎల్జీ సంస్థ తన ఉత్పత్తుల ధరలకు రెక్కలు జోడించగా, పానసోనిక్ సంస్థ కూడా తాము కూడా త్వరలోనే ధరలను పెంచుతామని ప్రకటించాయి. అయతే వీటికి భిన్నంగా సామ్ సంగ్ సంస్థ మాత్రం తన ఉత్పత్తులపై ధరలను తగ్గించింది. అయితే ఇది యావత్ దేశ ప్రజలకు వర్తించదని మెలిక కూడా పెట్టింది.
జీఎస్టీ అమలు తర్వాత దేశ అర్థిక రాజధాని ముంబైలో మాత్రమే తన ఉత్పత్తులపై రేట్లను తగ్గిస్తున్నట్టు సామ్ సంగ్ ప్రకటించింది. స్పాన్లు, టెలివిజన్లు, మైక్రోఓవెన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, ఎయిర్ కండీనర్లు వంటి కేటగిరీల్లో ఈ ధరల తగ్గింపు ఉంటుందని సామ్ సంగ్ తెలిపింది. కొత్త ధరలపై డీలర్లకు సమాచారం అందించినట్టు కూడా పేర్కొంది. అయితే ఈ కొత్తపన్నుల విధానంలో ఢిల్లీ వంటి ఇతర ప్రధాన నగరాల్లో కూడా ధరలను తగ్గించిందా? లేదా? అన్నది ఇంకా స్పష్టంకాలేదు.
దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని దేశంలోని రాష్ట్రాల ప్రజలకు ఈ తగ్గింపును ఎందుకు వర్తింపచేయడం లేదో సంస్థ వర్గాలకే తెలియాలి. అయితే ఈ విషయంపై కంపెనీ అధికార ప్రతినిధి సంప్రదించినా అతను స్పందించడం లేదు. ఓ వైపు సామ్ సంగ్ ప్రధాన ప్రత్యర్థి అయిన ఎల్జీ తన ఎల్ఈడీ టీవీలపై ధరలను పెంచగా.. పానాసోనిక్ కూడా అదే బాటలో పయనిస్తామని ప్రకటించింది. అయితే సామ్ సంగ్ మాత్రం ధరలను ఎలా తగ్గించిందన్న విషయమై కస్టమర్లలో కన్ఫూజన్ నెలకొంది. కాగా డీలర్లకు అందిన సమాచారం ప్రకారం కొన్ని ఉత్పత్తులపై ఎక్స్చేంజ్ ధరలను కూడా అందిస్తున్నట్టు తెలిసింది.
తగ్గిన ధరలు ఎలా వున్నాయో చూద్దామా..
22 అంగుళాల ఎల్ఈడీ టీవీపై 3 శాతం ధర తగ్గింది. పాతధర రూ.13,900- కొత్త ధర రూ.13,500.
32 అంగుళాల ఎల్ఈడీ టీవీపై 8 శాతం ధర తగ్గింది. పాతధర రూ.38,900- కొత్త ధర రూ.35,900
49 అంగుళాల ఎల్ఈడీ టీవీపై 10 శాతం ధర తగ్గింది. పాతధర రూ.94,500- కొత్త ధర రూ.84,900
వీటితో పాటు అన్ని టీవీ మోడళ్లపై ధరలు తగ్గించింది సామ్ సంగ్.
ఏసీ కేటగిరీలో
1-టన్ను స్ప్లిట్ యూనిట్ పాత ధర రూ.31,400 కొత్త ధర రూ.30,300
1.5-టన్ను స్ప్లిట్ యూనిట్ పాత ధర రూ.54,500 కొత్త ధర రూ.51,900
2-టన్ను స్ప్లిట్ యూనిట్ పాత ధర రూ.66,600 కొత్త ధర రూ.66,600
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more