భారతీయ బ్యాంకులకు వేల కోట్ల రుణాలను పోంది ఉద్దేశపూర్వకంగా వాటిని ఎగ్గొట్టి లండన్ పారిపోయి మళ్లీ తన జల్సాలకు ఏ మాత్రం ఢోకాలేదని చాటిచెబుతూ.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ అడుతున్న మ్యాచ్ లకు దర్జాగా వచ్చి వీక్షిస్తున్న అర్థిక నేరస్తుడు, లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా విషయంలో కేంద్రం నుంచి అనూహ్యమైన ప్రకటన వెలువడింది. ప్రస్తుతం లండన్ లో ఉంటున్న విజయ్ మాల్యాను భారత్ కు తీసుకురావడం అంత సులువైన విషయం కాదని కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వీకే సింగ్ అన్నారు.
లండన్ కోర్టులో ఇవాల మాల్యాను వెనక్కు రప్పించే విషయమై విచారణ జరుగతుండగా, అది అంత సులువైన పని కాదని కేంద్రమంత్రి అన్నడంలో అంతర్యమేమిటీ.. ఇది దేనికి సంకేతంగా భావించాలో కూడా భారత ప్రజలకు, అటు బ్యాంకులకు కూడా గోచరించడం లేదు. బ్యాంకులకు అప్పులు ఎగవేయడం ఇతరత్రా ఆరోపణలపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన డాక్యుమెంట్లను బ్రిటన్ కు పంపించామని తెలిపిన కేంద్ర విదేశాంగ శాఖ సహాయమంత్రి వాళ్ల చట్టం పరిమితులు ఇచ్చిన వెంటనే మాల్యాను తీసుకువస్తామని స్పష్టం చేశారు.
మాల్యాను ఎప్పుడు తీసుకువస్తామన్న అంశాన్ని ఇప్పుడే తేల్చలేమని వీకే సింగ్ తెలిపారు. మాల్యా దేశం దాటి వెళ్లిన సందర్భంలో అర్థిక నేరగాళ్ల భరతం పడతామని, ప్రపంచంలో ఎక్కడ దాక్కున్నా.. వారిని వెనక్కు రప్పించి.. చేసిన అప్పులను తీర్చేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన కేంద్రం.. తాజాగా ఇస్తున్న సంకేతాలు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా వున్నాయన్న అరోపణలు వినిపిస్తున్నాయి. బ్రిటన్ ఎప్పుడు పర్మిషన్ ఇస్తే అప్పుడే మాల్యాను భారత్ కు తీసుకువస్తామని కేంద్ర మంత్రి వెల్లడించడంలోనే తాత్సార ధోరణి కనబడుతుందన్న విమర్శలు వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more