పోలీస్ అంటే తెలంగాణ పోలీసే.. మాట్లల్లోనే కాదు చేతల్లో కూడా ఇంతటి ఫ్రెండ్లీ పోలీస్ దేశంలో ఎక్కడ కనిపించదు.. అని ఇటీవలే ముఖ్యమంత్రి కేసీఆర్ తెగ పొడిగేశారు. ఇలా ప్రశంసలు కురిసిన చోటే.. ఓ కానిస్టేబుల్ అనుచిత వైఖరితో తెలంగాణ పోలీస్ పరువు తీశాడు. సర్లే కదా కానిస్టేబుల్ అనుచిత వైఖరిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటారులే.. అంటే వాళ్ల కానిస్టేబుల్ నే వెనకేసుకు వచ్చే ధోరణితో వ్యవహరించడంతో సామాజిక కార్యకర్త వర్షా బార్గవి ఏకంగా షాక్ కు గురైంది.
తన తండ్రి నివాసముంటున్న ఇంట్లో చోరి జరిగిందని పిర్యాదు చేయడానికి వెళ్తే.. ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించాలని చెప్పి తనతో పాటు వచ్చిన కానిస్టేబుళ్లలో ఒకరు వివరాలు రాసుకోగా, మరో కానిస్టేబుల్ మాత్రం ఏకంగా తన వక్షోజాలను చూడటమే పనిగా పెట్టుకున్నాడని, తన పట్ల అసభ్యకర దృష్టిని కనబర్చాడని అరోపిస్తూ.. ఏకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసింది. జీడిమెట్ల పోలీస్ కానిస్టేబుల్ నిర్వాకం విషయం తెలుసుకున్న డీజీపి సైబరాబాద్ కమీషనర్ కు ఈ కేసును విచారించాలని అదేశించారు.
డీజీపీ అదేశంతో పోలీసు యంత్రాంగంలో కదిలిక వచ్చింది. వెనువెంటనే సైబరాబాద్ కమీషనర్ సంబంధిత డీసీపీకి సమాచారం అందించి.. కేసును స్వయంగా విచారించాలని అదేశించారు. దీంతో ఇవాళ ఉదయం 7:30 నుంచి 8 మధ్య బాధితురాలికి ఫోన్ చేసిన డీసీపి.. కేసు విషయాలపై విచారించాగా, అన్ని విషయాలు చెప్పింది బాధితురాలు. అయితే రిపోర్టు చేసే మెకానిజం ఈజీగా ఉండాలని.. బాధితురాలు చెప్పినట్లుగా అయితే సెక్స్యువల్ క్రైమ్స్ రిపోర్టు చేయడానికి పోలీసులు వెనుకాడతారని.. న్యాయస్థానంలోనూ ఇలాంటి కేసులు నిలవవని డీసీపీ అమెతో చెప్పుకోచ్చారు.
ఈ వివరాలను వెల్లడిస్తూన్న క్రమంలో డీసీసీ చాలా యాదృచ్చకంగా ఎలా అనేశారంటే... క్యాజువల్ గా 'మా వైపు కూడా ఒక్కోసారి అలాగే చూస్తారని అన్నారని బాధితురాలు తెలిపింది. డీసీపీ స్థాయి మహిళా పోలీసు అధికారిణే ఇలా వ్యాఖ్యానించడంతో ఒక్కసారిగా అమె షాక్ కు గురైంది. పోలీసు ఉన్నత అధికారినే.. అలా మాట్లాడారంటే, మామూలు సామాన్య ప్రజలు ఎవరికి చెప్పుకోవాలి? అని బాధితురాలు ప్రశ్నించారు. దీంతో పోలీస్ ట్రైనింగ్ లోనే ప్రాబ్లమ్ ఉండే ఉంటుందని అమె అభిప్రాయపడ్డారు. అది తొలగిపోవాలని అమె అకాంక్షించారు.
ఆ రోజు తాను వేసుకున్న డ్రస్ లో లోపం వుందేమో అందుకనే కానిస్టేబుల్ అలా అమె వంక అనుచితంగా వ్యవహరించాడేమో అన్న అరోపణలపై కూడా అమె ముక్కుసూటిగా సమాధానం ఇచ్చింది. ఆ రోజు తాను వేసుకున్న డ్రెస్సులో ఎలాంటి లోపం లేదని, చూసే దృష్టిలోనే లోపం ఉందని అన్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఓ టీవీ చానల్ తో మాట్లాడిన బాధితురాలు, పత్రికల్లో తన ట్వీట్ పై వార్తలు వచ్చిన తరువాత, తనకు ఫోన్ చేసిన ఓ మహిళా డీసీపీ.. ఇలా తనతో సంబాషించారని అ వివరాలను తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more