mudragada padmanabham says only two are peoples cms ప్రజల కష్టాలను పంచుకున్న ముఖ్యమంత్రులిద్దరే: ముద్రగడ

Mudragada padmanabham says only two are peoples cms

mudragada padmanabham, kapu activist, YS rajashekar reddy, NT RamaRao, peoples cms, Andhra Pradesh

Andhra pradesh peoples heart winning chief ministers are only two one is late YS Rajashekar reddy and other is late NT Rama rao says kapu activist mudragada padmanabham

ప్రజల కష్టాలను పంచుకున్న ముఖ్యమంత్రులిద్దరే

Posted: 06/05/2017 10:27 AM IST
Mudragada padmanabham says only two are peoples cms

తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు అనేక మంది ముఖ్యమంత్రులైనా.. ప్రజల నాడి తెలిసిన వారు ఇద్దరేనని, ప్రజలకోసం సరికొత్త పథకాలను తీసుకువచ్చిన వారు కూడా ఆ ఇద్దరేనని మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. ప్రజాహితం కోసం వారు ఎంతవరకైనా వెళ్లారని, అందుకనే వారు ఇప్పటికీ జనంలో నిలిచిపోయారని అన్నారు. ఆ ఇద్దరూ ఎవరనేగా.. అక్కడికే వస్తున్నాం.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి, స్వర్గీయ నందమూరి ఎన్టీరామారావులేనట. వీరిద్దరూ ప్రజల సంక్షేమం కోసం అలోచించి అనేక పథకాలను తీసుకువచ్చారని ముద్రగడ అన్నారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, వైఎస్ రాజశేఖరరెడ్డి ఇంచు మించు దానకర్ణుడే నని అన్నారు. నిజంగా దానకర్ణుడి కోవకు చెందిన వాడు కాబట్టే.. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏ కార్యక్రమం కావాలంటే ఆ కార్యక్రమం చేబట్టి, ప్రజలను ఆకట్టుకున్నారని అన్నారు.

ప్రజల కష్టాల్లో పాలుపంచుకున్న వ్యక్తి రాజశేఖర్ రెడ్డని కొనియాడారు. అలా ప్రజల గురించి ఏదో చేయాలన్న తప్పన స్వర్గీయ ఎన్టీరామారావులో కూడా బాగా వుండిందని అన్నారు. ఎన్టీరామారావు కూడా చాలా గొప్ప వ్యక్తి అని  ప్రశంసించారు. మిగిలిన ముఖ్యమంత్రులెవ్వరూ తనను అంతగా ఆకట్టుకోలేదన్నారు. పనిలో పనిగా చంద్రబాబు ప్రభుత్వం పనితీరును ఆయన తూర్పారబట్టారు. చంద్రబాబు పాలనలో గంటలకొద్దీ మీటింగ్ లు తప్ప..  అవుట్ పుట్ నిల్ అని అన్నారు. మరోలా చెప్పాలంటే అపరేషన్ సస్సెక్స్ బట్ పేషంట్ డెడ్ అన్న విధానాన్ని తలపిస్తేందూ తప్ప ఏముండదని విమర్శించారు. నటిస్తారని, సొల్లు చెబుతారని, చెప్పిందే చెబుతారని ముద్రగడ విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles