సభ్య సమాజం సిగ్గుతో తలదించుకునే ఘటన ఆంద్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో జరిగింది. అదమరిచి నిద్రిస్తున్న ఆ చిన్నారి పట్లు కన్నతండ్రే కాలయముడయ్యాడు. ఆమె బంగారు భవిష్యత్తును మొగ్గలోనే చిదిమేశాడు. మద్యం మత్తులో కన్నకూతురిపైనే కాటు వేశాడు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్ మండలం కొంతమూరు సంతోష్నగర్లో ఈ దరాగతం చోటుచేసుకుంది. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవించే వ్యక్తికి కాకినాడ ప్రాంతానికి చెందిన ఓ యువతితో వివాహం జరిగింది. వీరికి ఒక బాబు, కూతురు వున్నారు. చెడు వ్యసనాలకు బానిసైన వ్యక్తితో తాను జీవించలేనని, కుటుంబపోషణ అసలు పట్టడం లేదని అతని భార్య అతడ్ని మూడేళ్ల కిందట వదిలి వెళ్లింది. కొడుకు, కూతురును కూడా తనతో తీసుకుని వెళ్లింది. కాగా పిల్లల భవిష్యత్తు కోసం కువైట్ వెళ్లింది. దీంతో అమ్మమ్మ ఇంటి వద్దే పిల్లలు చదువుకుంటున్నారు. కాగా భర్త మాత్రం కొంతమూరులోనే అతని తల్లిదండ్రులతో కలసి వుంటున్నాడు.
కనీసం పిల్లలు వెళ్తేనన్న అతని మనసు మారుతుందని, కుటుంబ పోషణ గురించి అలోచిస్తాడని భావించిన పిల్లల అమ్మమమ వారిని ఓ సారి మీ నాన్న వద్దకు వెళ్లి రావాలని కోరింది. దీంతో అన్నా చెల్లెలిద్దరూ గత నెల 13న తండ్రి వద్దకు వచ్చారు. రాత్రి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం. దానికి తోడు ఉక్కపోతతో అతని కుటుంబసభ్యులు అందరూ ఆరుబయట నిద్రిస్తుండగా బాలిక ఒక్కతే ఇంట్లో నిద్రించింది. రాత్రి 12 గంటలకు ఇంటికి వచ్చిన తండ్రి.. కూతురి నోటిని అదిమిపట్టి అత్యాచారం చేశాడు. బాధను భరించలేని ఆ బాలిక.. తండ్రి చేసిన అకృత్యాన్ని అమ్మమ్మకు చెప్పింది. చుట్టుపక్కలవారి సహాయంతో అమె రాజానగరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాలికను రాజమహేంద్రవరం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని సీఐ కె.వరప్రసాద్ తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more