జాతీయ స్థాయి షూటర్ గా పేరుప్రఖ్యాతులు తెచ్చుకున్న ప్రశఆంత్ బిష్ణోయ్.. దేశానికి పేరు తీసుకువస్తాడని భావించగా, దేశద్రోహానికే పాల్పడ్డాడు. అక్రమ మార్గంలో అదాయాన్ని సంపాదించాలని ఏకంగా విమానాశ్రయ అధికారులను తన వద్ద అనుమతులు వున్నాయంటూ బురిడీ కొట్టించి దేశంలోకి అదునాథన అయుధాలను దిగుమతి చేసుకుని వన్యప్రాణులను వేటాడి చంపి వాటి చర్మం, ఇతర అవయవాలను విదేశాలకు స్మగ్లింగ్ చేసి కాసులు గడించి..ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు.
సరైన అనుమతులు ల్లేకుండా నాలుగున్నర కోట్ల రూపాయల విలువైన 25 మారణాయుధాలను స్మగ్లింగ్ చేస్తున్న అంతర్జాతీయ ముఠాను గత ఏప్రిల్ 29న ఢిల్లీలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముఠాలో వున్న నిందితులను విచారించగా, వారిచ్చిన సమాచారంతో మీరట్ లోని జాతీయ షూటర్ ప్రశాంత్ బిష్ణోయ్ నివాసంలో అప్పుడే సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన నివాసంలో కోటి రూపాయల నగదు, విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసుకున్న అత్యాధునిక ఇంపోర్టెడ్ ఆయుధాలు, మందుగుండు సామగ్రితో పాటు 117 కేజీల మనుబోతు మాంసం, కొమ్ములు, చిరుతపులి, కృష్ణజింకల చర్మాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో ప్రశాంత్ బిష్ణోయ్ ను అరెస్టు చేసిన పోలీసులు అతడ్ని అదుపులోకి తీసుకుని విచారించగా అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అంతర్జాతీయ ముఠాలతో కలిసి ఆయుధాల అక్రమ రవాణా చేయడంతో పాటు అదే సమయంలో స్మగ్లింగ్ ముఠాలకు వాటిని విక్రయించి దేశం దాటిస్తానని ప్రశాంత్ బిష్ణోయ్ అంగీకరించాడు. ఇక అత్యంత వేగంగా పరిగెత్తే చిరును కూడా చంపానని, దాంతో పాటు అనేక వన్యప్రాణుల ప్రాణాలు తీసి వాటి అవయావాలను అమ్మి కూడా సొమ్మ చేసుకున్నట్లు అంగీకరించాడు. తనకు అమిత్ గోయల్, అనీల్ లంగన్, స్లోవెన్యన్ దేశస్థుడైన డోరిస్ సొబోటిక్ సహకరించారని తెలిపాడు. అక్రమ రవాణా (స్మగ్లింగ్) తో పాటు వన్యప్రాణులను వేటాడాన్న నేరాల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు కొర్టులో హజరుపర్చాగా, న్యాయస్థానం బిష్ణోయ్ కు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more