పాత పెద్ద నోట్ల రద్దు తదనంతరం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు గానే కేంద్రం తీసుకువచ్చిన అనేక మార్పులతో ప్రస్తుత అర్థిక సంవత్సరం నుంచి రెండు లక్షల రూపాయలకు మించి నగదు లావాదేవీలు జరిపే ఛాన్స్ లేదు. నోట్ల రద్దు తర్వాత నగదు లావాదేవీలపై సరికొత్త ఆంక్షలను కేంద్రం విధించిన నేపథ్యంలో ఇకపై రెండు లక్షల రూపాయల కన్నా అధికంగా జేబులో, ఇంట్లో డబ్బు వున్నా అది నేరమే. ఈ మేరకు కేంద్ర వార్షిక బడ్జెట్ పొందుపర్చి చట్టంగా చేసిన విషయం తెలిసో తెలియకో నగదు లావాదేవీలు చేస్తున్న వారిని అదాయ పన్ను శాఖ అధికారులు మరోసారి హెచ్చరించారు.
అర్థిక లావాదేవీలను నగదు రహితంగా మార్చేందుకు కేంద్ర తీసుకువచ్చిన ఈ కొత్త చట్టం ముందుగా 3 లక్షల రూపాయల లిమిట్ విధించి.. ఆ తరువాత దానిని 2 లక్షలకు కుదించారు. దీంతో ఇకపై రూ.2లక్షలు.. అంతకు మించిన నగదును లావాదేవీలు జరిపితే.. ఇక వారు జరిమానాలకు కట్టాల్సిందే. ఈ జరిమానాలు ఏ విధంగా వుంటాయో తిలిస్తే షాక్ అవ్వాల్సిందే. రెండు లక్షలకు మించి ఎంత మేర నగదు లావాదేవీలు జరిగితే.. అంతే మొత్తంలో జరిమానా విధిస్తామని ఆదాయపన్ను శాక అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు.
మరి రూ.2 లక్షలకు మించిన లావాదేవీలను ఎలా చేయాలన్న ప్రశ్న మీ మదిని తొలుస్తుందా..? ఇకపై ఇలాంటి అన్ని లావాదేవీలను డిజిటల్ బాటలోనే జరపాలి. దీంతో మీ బ్యాంకు ఖాతాలో ఎంత మేర జమ అవుతుంది. ఎంత మేరకు వెళ్తుందన్న విషయాలు అదాయపన్ను శాఖ అధికారులకు బ్యాంకు అధికారుల నుంచి వివరాలు వెళ్తాయి. దీంతో ప్రతీ ఒక్కురు దేశప్రగతి కోసం తమ వంతుగా అదాయ పన్నును సక్రమంగా చెల్లించే అవకాశం వుంటుంది. అందుకనే ఈ విధమైన నిబంధనను కేంద్రం తీసుకువచ్చింది.
నల్లధనాన్ని అరికట్టేందుకు వీలుగా తాజా రూల్ ను తీసుకొచ్చేశారు. సో.. రూ.2లక్షలు.. అంతకు మించిన మొత్తాన్ని కానీ నగదు రూపంలో చెల్లిస్తుంటే.. వెంటనే దానికి చెక్ చెప్పండి. లేదంటే అడ్డంగా బుక్ కావటమే కాదు.. భారీ ఎత్తున జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక భారీగా నగదు లావాదేవీలు జరుగుతున్న వివరాలను తమకు తెలియజేయాల్సిందిగా కూడా అదాయపన్ను శాఖ ప్రజలను కోరింది. ఈ మేరకు ఎవరైనా సమాచారం ఇవ్వవచ్చని తమ తమ ఈ మెయిల్ అడ్రస్ This email address is being protected from spambots. You need JavaScript enabled to view it. కూడా ప్రజలకు ఇచ్చింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more