గత మూడేళ్లుగా మనం తుగ్లక్ పాలనను చవిచూశామా.? అవును దేశప్రజలందరూ గత మూడేళ్లుగా చవిచూసింది తుగ్లక్ పాలనే అని అంటున్నారాయన. కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపి విజయ్ దివాస్ పేరిట సంబరాలు చేసుకుంటున్న తరుణంలో.. ఈయనెవరండీ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అంటున్నారా.? ఆయన మరెవరో కాదు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, బీజేపీ ప్రభుత్వ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఆయన విమర్శించారు. బీజేపి ద్వంద వైఖరిని దేశప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. అధికారంలోకి రాకముందు ఒకలా అధికారంలోకి వచ్చిన తరువాత మరోక మాదిరిగా మాటలు మారుస్తూ ప్రధాని మోదీ ప్రజలను మాయమాటలతో మభ్య పెడుతున్నారని సీఎం సిద్ధరామయ్య ఘాటుగా విమర్శించారు.
2014కు ముందు కేంద్రలో అధికారంలోఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన జీఎస్టీ బిల్లును, ఆధార్ కార్డుల అనుసంధానం ప్రక్రియను అప్పట్లో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్రమోదీ తీవ్రంగా వ్యతిరేకించారని, కేంద్రంలో అధికారంలోకి రాగానే అదే జీఎస్టీ బిలు, ఆధార్కార్డు అనుసంధానం ప్రక్రియలను అమలు చేశారని గుర్తుచేశారు. అధికారం చేపట్టిన మూడేళ్లలో బీజేపీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో శంఖుస్థాపనలు చేసి పనులు ప్రారంభించిన ప్రాజెక్టుకుల మోదీ జాతీకి అంకితమిస్తూ అంతా తానే చేశానన్న దోరణిలో వ్యవహరిస్తున్నారని అన్నారు.
యూపీఏ ప్రభుత్వహయాంలో ప్రవేశపెట్టిన పథకాలకు పేర్లు మార్చి బీజేపి ప్రభుత్వం తమ పథకాలుగా ప్రచారం చేసుకోవడం తప్ప ఏమీ సాధించిందేమి లేదని మండిపడ్డారు. యూపీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నిర్మల భారత్ను స్వచ్ఛభారత్గా, రాజీవ్గాంధీ విద్యుద్ధీకరణ పథకాన్ని... దీన్దయాళ్ పథకంగా మార్చారని ఎద్దేవా చేశారు. గత యూపీఏ ప్రభుత్వంపై విమర్శలు చేసే ప్రధాని ఆ ప్రభుత్వం తీసుకువచ్చిన పధకాలను ఎందుకు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపి అమలు చేస్తున్న పథాకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోనివేనని పేర్కొన్నారు. తాము అధికారంలోకి నిరుద్యోగ సమస్యను నిర్మూలిస్తామన్న పెద్దలు.. ఇప్పుడు దేశంలోని ప్రతీ ఒక్కరికీ ఉద్యోగం కల్పించడం కుదరదని తెగేసి చెబుతున్నారని మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల కొత్త ఉద్యోగాలు కల్పిస్తామని ప్రగల్భాలు పలికిన బీజేపీ.. గత మూడేళ్లలో కేవలం నాలుగు లక్షలేనని విమర్శించారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో విదేశాలో మూలుగుతున్న నల్లధనాన్ని దేశానికి తీసుకువస్తామని ప్రతీ పేదవాడి అకౌంట్ లో మూడు లక్షల వేస్తామన్న హామీ ఏమైందని నిలదీసిన ఆయన మూడేళ్లలో అది ఎంతవరకు నెరవేరిందని ప్రశ్నించారు. నల్లధనాన్ని నిర్మూలించే ప్రధాన ఉద్దేశంతో పెద్ద నోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఓ మహా నాటకమని, అది కేవలం కొన్ని బడా కార్పోరేట్ సంస్థల ప్రయోజనాలను కాపాడేందుకు తీసుకున్న నిర్ణయంగా సీఎం సిద్ధరామయ్య అభివర్ణించారు. ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో బీజేపి నేతలకు దళితులు గుర్తుకొస్తారని, అది వారి ఓట్లపై ప్రేమే తప్ప దళితులపై ప్రేమ కాదని దుయ్యబట్టారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more