ప్రియమైన సోదరీ సోదరీమణులారా.. ఇది తెలుగు దేశం పార్టీ స్థాపించేందుకు ముందు తెలుగు రాష్ట్ర ప్రజలకు సుపరిచితమైన మాట. దీనితోనే నేతలు అప్పట్లో తమ రాజకీయ ప్రసంగాలను మొదలు పెట్టేవారు. కానీ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తరువాత.. ఎన్నికల సమరాంగనంలోకి అన్నగారు స్వర్గీయ ఎన్టీరామారావు దిగిన తరువాత.. ఆ పద్దతిని పక్కనబెట్టేశారు. నా తెలుగింటి ఆడపడచులకు, అక్క చెల్లెలకు అంటూ మహిళలను అక్కున చేర్చుకునేలా ప్రసంగాలను చేసి వారి ఓట్లను తమ అకౌంట్ లో వేయించుకున్నారు.
అయితే అది కేవలం ఎన్నికలకే పరిమితం కాలేదు. మహానాడులోనూ, పార్టీ సమావేశాలల్లోనూ ఎన్టీయార్ దానిని విరివిగా వాడి తెలుగు దేశా పార్టీ మహిళమణుల ఔనాత్యాన్ని పెంచేలా అనేక చర్యలు తీసుకున్నారు. కాలగమనంలో ఆయన అనంతవిశ్వంలోకి వెళ్లినా.. ఇప్పటికీ ఆయనకు లక్షల సంఖ్యలో మహిళా అభిమానులు వున్నారంటే అది ఆన వారికి ఇచ్చిన మర్యాద., గౌరవం వల్లనే. ఆర్టీసీ బస్సులలో వారికి ప్రత్యేక సీట్లను కేటియించడం నుంచి తల్లిదండ్రుల ఆస్తులలో వాటా వారకు అన్నింటా మహిళలకు ప్రాధాన్యత కల్పించారు. అందుచేతే అన్నగారంటే తెలుగు మహిళలకు ఎనలేని అభిమానం.
కాగా, తాజాగా చంద్రబాబు నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ మాత్రం మహిళలకు ఆ ప్రాధాన్యతను ఇవ్వడం లేదని, కేవలం ఎన్నికల వరకు వారి సేవలను వినియోగించుకుని ఆ తరువాత కూరలో కరివేసాకులా తీసిపారేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. వెఎస్ దెబ్బతో దాదాపుగా పదేళ్లు అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ.. తదనంతర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర పునర్విభజన జరిగి కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అధికారంలోకి వచ్చినా.. అక్కడ కూడా తెలుగు మహిళలకు తగిన ప్రాధాన్యం, ప్రాముఖ్యతను ఇవ్వడం లేదని పలువురు నేతలు వాపోతున్నారు.
పార్టీ నిర్వహించిన మహానాడులో చేధుఅనుభవం ఎదురైన నటి కవిత కూడా ఇదే అవేదనను వ్యక్తం చేశారు. ప్రాంగణంలో ఏర్పాటు చేసిన భారీ వేదికపైకి తనను ఆహ్వానించకపోవడంతో ఆమె మనస్తాపానికి గురయ్యారు. దీంతో, మహానాడు ప్రాంగణం నుంచి ఆమె వెళ్లిపోయారు. టీడీపీలో తనకు జరుగుతున్న అవమానాలను తట్టుకోలేకపోతున్నానని ఈ సందర్భంగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం తనను వేదికపై కూర్చోబెట్టారని... అధికారంలోకి వచ్చాక తనను పక్కనపెట్టి అవమానిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇదెక్కడి న్యాయమని కవిత ప్రశ్నించారు. మహిళామణుల అధరణను చూరగోన్న పార్టీ అని ఢంకా బజాయించే పార్టీలోనే మహిళా నేతలకు అవమానాలు జరగడం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more