అమెరికాలో విమాన ప్రమాదం సంభవించింది. చిన్న విమానం ల్యాండింగ్ అవుతున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకుంది. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్రంలో ముఖిల్టియో పట్టణంలో రద్దీగా వుండే రహదారిపై ఈ ప్రమాదం చోటుచేసుకోగా, వాహనాలలో అమర్చిన డాష్ బోర్డు కెమెరా దానిని బంధించింది. అది కాస్తా ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ ప్రమాదంలో తృటిలో పైలట్ తన ప్రాణాలను కాపాడుకున్నాడు. అయితే ఈ ప్రమాదం వల్ల భారీగానే నష్టం వాటిల్లిందని ముఖిల్టియో పట్టణంపోలీసులు తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే..అమెరికాలోని పెయినీ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ నుంచి సింగిల్ ఇంజిన్ విమానం టేకాఫ్ తీసుకోగానే అందులో సాంకేతిక సమస్య తలెత్తింది. దీనిని గుర్తించిన పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించాడు. సీటెల్ ప్రాంతంలో దిగే క్రమంలో.. ల్యాండింగ్ చేయాలన్న కంగారులో అక్కడున్న విద్యుత్ స్థంబాలను మర్చిపోయాడు. దీంతో విమానం ల్యాండింగ్ సమయంలో అక్కడున్న ఓ కరెంట్ పోల్ ను ఢీకొంది. ఆ పక్కనే ఉన్న ట్రాఫిక్ సిగ్నల్స్ పోల్స్ ను కూడా ఢీకొట్టింది.
అంతే వెనువెంటనే విమానానికి నిప్పంటుంకుంది. అలాగే ఒకటి రెండు సెకన్ల పాటు ముందుకు రాగానే మంటలు వ్యాపించాయి. దీంతో విమానం అక్కడికక్కడే కుప్పకూలీపోయింది. దీంతో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తూ ఎవరికీ ఏమీ జరగలేదు. పైలట్ కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అయితే ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలిచిన వాహనాలు మాత్రం మంట్లోల దహనమయ్యాయి. ఓ కారు యజమానురాలు తన అదృష్టం బాగుండి ముందుగానే ప్రమాదాన్ని గుర్తించానని చెప్పింది.
దీంతో విమానం తమ కారును ఢీకొడుతుందని తన కారులో వున్నవారిని అప్రమత్తం చేసి దిగాలని చెప్పి కారును అలాగే వదిలేసి వెనక్కు వెళ్లిపోయామని, తాము ఊహించినట్టుగానే తమ కారును విమానం తోక ఢికొనిందని చెప్పారు. కాగా, నిత్యం వాహనాలతో రద్దీగా ఉండే రోడ్డుపైనే ఈ బుల్లి విమానం పడటం.. ఎవరికీ ఏమీ కాకపోవటంతో ఊపిరిపీల్చుకున్నారు అధికారులు. ప్రమాదం జరిగిన తీరు చూస్తే పైలట్ సేఫ్టీగా బయటపడటం వండర్ అంటున్నారు. ఇప్పుడీ వీడియో నెట్ లో హల చల్ చేస్తుంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more