ఒక మనిషికి ఆఖరి క్షణాలు ఎంత నరకప్రాయంగా ఉంటాయో తెలియజెప్పే చిత్రం ఇది. సరిగ్గా నాలుగేళ్ల క్రితం అమెరికా భద్రత దళాలు అఫ్ఘనిస్థాన్ లో పేలుళ్లపై అవగాహన కోసం ఓ కార్యక్రమం నిర్వహించాయి. ఇందులో భాగంగా ఓ మోటర్ ట్యూబ్ సడన్ గా పేలిపోవటంతో భారీ విస్ఫోటనం సంభవించి ఐదుగురు చనిపోయారు. కట్.. చేస్తే ఇప్పుడు ఆ పేలుడుకు సంబంధించిన ఫోటోలు విడుదల అయ్యాయి.
ఇంతకీ ఈ ఫోటోలు తీసింది ఎవరో కాదు హిల్దా క్లేటన్ అనే యువతి. 22 ఏళ్ల క్లేటన్ ఆర్మీకి సంబంధించిన ఫోటో గ్రాఫర్. చిన్న వయసులోనే డాక్యుమెంటరీ లను తీయటం పనిగా పెట్టుకుంది. తర్వాత దేశ సేవ కోసం యూఎస్ భద్రతా దళాల్లో చేరి, అక్కడ కూడా తన ఇంట్రెస్ట్ ను కొనసాగించింది. అలా అఫ్ఘనిస్థాన్ లో యూఎస్ భద్రతా దళాల డాక్యుమెంటరీలను షూట్ చేయటం మొదలుపెట్టింది.
2013 జూలై 2న లాగ్ మన్ వద్ద అప్ఘన్ సైనికులకు శిక్షణ ఇచ్చే కార్యక్రమం షూట్ చేస్తుండగా పొరపాటున బాంబు పేలింది. ఈ దాడిలో కార్యక్రమాన్ని కవర్ చేస్తున్న క్లేటన్ తోపాటు ఆమె సహాయకుడు, మరో ముగ్గురు సైనికులు చనిపోయారు. ఆ ఘటన తర్వాత ఇన్నేళ్లకు మిలిటరీ రివ్యూ పేరిట వెలువడే జర్నల్ లో ఆ ఆఖరి క్షణాలను రిలీజ్ చేసింది. మంటలు ఒక్కసారిగా ఎగిసి పడి, దుమ్ము దూలి పేరుకుపోయి ఉండటం, సైనికుల ఫోటోలు అందులో చూడొచ్చు.
క్లేటన్ తీసిన ఆఖరి ఫోటోల గురించి ఆ కథనంలో ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఆమె చేసిన సేవలను కొనియాడారు సైనిక అధికారులు. ఆర్మీలో ఉండగా ఆమెనంతా లాంగ్ నైఫ్ అని పిలిచేవారని, చాలా చురుకుగా ఆమె పని చేసేదని ఓ అధికారి ఆమె గురించి చెబుతూ కన్నీటి పర్యంతం అయ్యాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more