వ్యాపారవేత్త, లిక్కర్ డాన్ గా పేరొందిన నాటి కింగ్ ఫిఫర్ అధినేత విజయ్ మాల్యా అరెస్టు కావడం.. ఆ తరువాత బెయిల్ రావడంలో కేవలం మూడు గంటల సమయం మాత్రమే పట్టింది. అయితే ఆ సమయమే చాలు అనుకున్నట్లు వున్నారు నెట్ జనులు. ఆయన అరెస్టు నేపథ్యంలో ఎవరికి తోచిన అలోచనలను వారు సోషల్ మీడియాలో పెట్టారు. మాల్యా అరెస్టు అయిన మూడు గంటల వ్యవధిలోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అయిన వ్యక్తిగా నిలిచాడు. ఇందుకు కారణం ఆయన అరెస్టుపై సోషల్ మీడియాలో పేలిన జోకులే.
ట్విట్టర్లో భారత్ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇది టాప్ ఫైవ్ ట్రెండింగ్ టాపిక్గా నిలిచింది. మాల్యాపై జోకులు పేల్చుతూ నెటిజన్లు తమ ప్రతిభనంతా చూపించారు. విజయ్ మాల్యా గత ఏడాది మార్చి 2న (సరిగ్గా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడానికి ముందు) లండన్ పారిపోగా, మళ్లీ ఇప్పుడు ఐపీఎల్ సీజన్ ప్రారంభం కావడంతో ఆ మ్యాచ్లు చూసేందుకే మాల్యా వస్తున్నాడని కొందరు వ్యంగంగా పోస్టులు చేస్తున్నారు. వాటి కోసమే తనకు తానుగా అయన అరెస్టు అయ్యాడని కూడా జోకులు పేలుతున్నాయి. మాల్యా మీద విపరీతంగా సెటైర్లు వేశారు. ఆయనను ఓ ఐటమ్ గా చేసేశారు నెట్ జనులు.
ఒకప్పుడు రాయల్ చాలెంజర్స్ జట్టు యాజమానిగా వున్న మాల్యా అరెస్టు కాగానే ఆర్సీబీ జట్టు పెర్ఫార్మెన్సు ఇక్కడే కాదు, లండన్లో కూడా బాగోలేదని కొందరు సెటైర్లు వేస్తున్నారు. మద్యం తాగే బారు నుంచి జైలు గోడల గేట్లకు వుండే బార్ల (ఊచలు) వెనక్కి వెళ్తున్నాడని ఇలా ఎవరికీ తోచిన విధంగా వారు సెటైర్లు వేశారు. ఇక దర్శకుడు శిరీష్ కుందర్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా ఇదే అంశంపై స్పందిస్తూ... 'బ్యాంక్ చోర్' సినిమా ప్రమోషన్ కోసమే విజయ్ మాల్యాను లండన్ నుంచి తీసుకొస్తున్నారని పేర్కొన్నాడు. ఇలా ఒకటి, రెండు కాదు.. మాల్యాపై సెటైర్ వేయడానికి ప్రపంచంలోని అన్ని అంశాలను వాడేసుకుంటున్నారు నెట్ జనులు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more