పాలు తాగి తల్లి రోమ్మునే గుద్దే సంతానం ఎంతవెతికినా కనిపించదు.. కానీ భారతమాత కన్నబిడ్డలుగా చలామణి అవుతూ.. ఇక్కడ సర్వసుఖాలను, ప్రభుత్వ పథాకాలను పోందుతూ.. కడుపు నిండిన తరువాత పరాయి దేశ పాట పడటం ఎంత దుర్మార్గమో వీరిని చూస్తే అర్థమవుతుంది. జమ్మూకశ్మీర్ లోని ఓ స్థానిక క్రికెట్ క్లబ్ ఇలాంటి చర్యను చేపట్టింది. బరితెగించి మరీ దుస్సాహసానికి పాల్పడింది. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపే తీరు ఇది కాదని దేశవ్యాప్తంగా పెద్దఎత్తున్న అగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి.
దేశ ప్రధాని నరేంద్రమోడీ జమ్మూకాశ్మీర్ వెళ్లి అక్కడ పర్యటించిన నేపథ్యంలో స్థానిక క్రికెట్ క్లబ్ ఆటగాళ్ల... ఏకంగా పాకిస్థాన్ జెర్సీలు ధరించి క్రికెట్ ఆడారు. అంతేకాదు ఇరు జట్టు సభ్యులు పాకిస్థాన్ జాతీయగీతాన్ని అలపించడంతో పాటు ఆ గీతానికి గౌరవసూచకంగా నిలబడ్డారు. ఈ ఘటన వివరాలు గురించి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన కొద్దిసేపటికే తీవ్ర విమర్శల దుమారం రేగింది. ఇది రాజద్రోహంగా పరిగణించాల్సిన నేరమని.. ఎందుకు ఉపేక్షిస్తున్నారని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను నెట్ జనులు నిలదీస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 2న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్లో పర్యటించి చెనాని-నస్రి సొరంగ మార్గాన్ని ప్రారంభించిన సమయంలో.. గాందెర్బల్ జిల్లాలోని వయిల్ గ్రౌండ్స్ లో క్రికెట్ ఆడిన స్థానిక జట్టు కేవలం పాకిస్థాన్ జెర్సీలు ధరించి క్రికెట్ అడారు. అంతటితో అగకుండా మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏకంగా పాకిస్థాన్ జాతీయగీతాన్ని ఆలపించి.. ఆ గీతం అలపిస్తున్నంత సేవు వారు గౌరవంగా నిల్చున్నారు. కొందరు పాక్ జాతీయ గీతాన్ని సైతం అలపించారు.
కశ్మీర్ జట్టు ధరించిన పాక్ జెర్సీలపై బాబా దార్య ఉద్ దిన్ పేరు రాసివుంది. ప్రముఖ సూఫీ సాధువు అయిన బాబా దార్య ఉద్ దిన్ దర్గా గాందెర్బల్ లోనే ఉండడం విశేషం. కాగా, కశ్మీర్ జట్టుతో తలపడిన జట్టు వైట్ జెర్సీలు ధరించినా వారు కూడా పాక్ జాతీయ గీతం అలపిస్తున్న సేపు గౌరవసూచకంగా నిలవడం గమనార్హం. ఇంతలా దేశాన్ని అవమానించేలా క్రీడాకారులు చర్యలు చేపడుతున్న కూతవేటు దూరంలోనే వున్న పోలీస్ స్టేషన్ లోని పోలీసులు ఏం చేస్తున్నారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా. చర్యలు మాత్రం ఇప్పటికే తీసుకోలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more