గోవా ఎన్నికలలో వెలుగులోకి కొత్త ‘కళలు’ AAP candidate’s wife accuses BJP MLA of spreading rumours

Aap candidate s wife accuses bjp mla of spreading rumours

election commission, goa elections, poll campaign, Aam Aadmi Party (AAP),Assembly Elections-2017,Bharatiya Janata Party (BJP),Goa Assembly Elections 2017,Mahadev Naik,Molu Velip, shiroda, latest news

In a complaint filed at the Ponda police station, the victim citing video footage of Industries minister Mahadev Naik verbally abusing her, has said that the latter accused her of sleeping around, while seeking for votes for her husband Velip.

గోవా ఎన్నికలలో వెలుగులోకి కొత్త ‘కళలు’

Posted: 01/30/2017 02:53 PM IST
Aap candidate s wife accuses bjp mla of spreading rumours

ఎన్నికలు అనగానే ఎన్నో ‘కళలు’ కనిస్తాయి. ఒటర్లను అకర్షించడానికి మంత్రలైనా సరే.. ప్రజలకు సాదాభివందనాలు చేయడం, లేదా టీ కాయడం, మంచి రద్దీ వున్న ప్రాంతాల్లో కిల్లీ కొట్టు వద్ద సిగరెట్లు, పాన్ లు అమ్మడం, కుండలు చేసే వారి వద్దకెళ్లి వాటిని తయారీ చేయడం ఇలా ఎన్నో కళలను ప్రదర్శిస్తుంటారు. అయితే ఇలా ప్రజలను అకర్షించడానికి ఓ మంత్రివర్యులు ఏకంగా తన ప్రత్యర్థి అబ్యర్థిపై అసభ్య ప్రచారానికి కూడా దిగాడు. ప్రజాస్వామ్య దేశంలో ఎన్నికల ప్రచారంలో పరాకాష్టగా ఈ ఘటన నిలిచింది. ప్రత్యర్థి భార్యపై పిర్యాదుతో ఇప్పుడా విషయం వెలుగులోకి వచ్చింది.

ఈ ఘటన ఐదు రాష్ట్రాల ఎన్నికలలో భాగంగా జరుగుతున్న గోవా అసెంబ్లీ ఎన్నికలలో చోటుచేసుకుంది. తాను మంత్రినన్న విషయాన్ని కూడా మర్చిపోయిన ఓ మంత్రివర్యులు.. తన ప్రత్యర్థి భార్యపై అసభ్య ప్రచారం చేస్తూ వికృత పర్వానికి తెరతీశారు. అధికార బీజేపీకి చెందిన మంత్రి ఒకరు.. ఆమ్‌ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భార్యను ఉద్దేశించి అత్యంత దారుణమైన అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. తన భర్త గెలుపు కోసం అమె ఎంతటి కార్యానికైనా తెగిస్తారని మంత్రి వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యల వీడియోను అధారంగా చేసుకుని గోవాలోని పొండా పోలీసులు కేసు నమోదుచేశారు.

మోలు విలిప్‌ అనే నాయకుడు శిరోదా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆమ్‌ఆద్మీ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. విలిప్‌ తరఫున ఆయన భార్య కూడా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. గోవా పరిశ్రమల శాఖ మంత్రి మహదేవ్‌ నాయక్‌ ఇటీలల శిరోదాలో పర్యటించిన సందర్భంలో విలిప్‌ భార్యపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు తెలిసింది. పూనం సావంత్‌ అనే బీజేపీ కార్యకర్తతో మంత్రి నాయక్‌ మాట్లాడుతున్న వీడియో ఒకటి లీకైంది. విలిప్‌ భార్య ఓటర్ల కాళ్లకు దండాలు పెడతారని, మగ ఓటర్లకు ఇతర మార్గాల్లోనూ ‘వల’విసురుతారని, అవసరమైతే అమె వారితో పడుకోడానికి కూడా సిద్దమౌతారని, కానీ తమకు మాత్రం అలాంటి అవసరమే లేదని మంత్రి వ్యాఖ్యానించడం వీడియోలో రికార్డయింది.

ఎలాగోలా వీడియోను చేజిక్కించుకున్న విలిప్‌ భార్య ఏకంగా మంత్రి చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై పొండా పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదుచేశారు. తన భర్తను ఓడించేందుకు బీజేపీ వాళ్లు నీచమైన ప్రచారాన్ని చేస్తున్నారని.. తనపై అసభ్యకరంగా ప్రచారం చేస్తున్నారని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొన్నారు. వీడియోలో ఆధారంగా పోలీసులు మంత్రి నాయక్‌పై కేసు నమోదుచేశారు. ఈ వ్యవహారంపై మంత్రివర్యులు మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు. కాగా ఆయన అనుచరులు మాత్రం దానిని కొట్టిపారేస్తున్నారు. వీడియోలోని మాటలను తప్పుగా అన్వయించుకున్నారని పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles