మరో టెక్కీ హత్య ఉదంతం కలకలం రేపుతోంది. ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో పని చేస్తున్న మహిళా ఉద్యోగి కార్యాలయంలోనే దారుణ హత్యకు గురైన ఘటన సంచలనంగా మారింది. 25 ఏళ్ల మహిళా ఉద్యోగిని విగతజీవిగా పడి ఉండటం, ఆపై అది హత్యగా ధృవీకరణ కావటంతో చిక్కుముడి విప్పదీసేందుకు పోలీసులు రంగంలోకి దిగారు.
కేరళకు చెందిన కే. రాసిలా రాజు ఇన్పోసిస్ లో ఉద్యోగం చేస్తోంది. కార్యాలయంలోని తొమ్మిదవ అంతస్తులో విధుల్లో ఉన్న సమయంలో రాసిలాను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. కంప్యూటర్ కు వాడే వైరుతో మెడకు ఉరి బిగించి హత్య చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. ఆదివారం సెలవు రోజు అయినప్పటికీ ఓ ప్రాజెక్టు విషయంలో ఆమె ఆఫీస్ కు వెళ్లింది. హత్యా సమయంలో బెంగళూరులోని ఇన్ఫీ టీమ్ తో ఆన్ లైన్లో ఆమె పని చేసుకుంటున్నట్టు కార్యాలయ వర్గాలు తెలిపాయి. ఈ ఘటన సాయంత్రం 5 నుంచి 6 గంటల ప్రాంతంలో జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు.
ఆఫీసు సెక్యూరిటీ గార్డును అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. రాసిలాను పలకరించేందుకు మేనేజర్ ఫోన్ చేయగా సమాధానం రాకపోవడంతో విషయం వెలుగులోకి వచ్చిందని పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నట్టు పుణె అసిస్టెంట్ కమిషనర్ వైశాలి జాదవ్ వెల్లడించారు. ప్రేమ కోణం ఏమైనా ఉందా? అని ఆరా తీస్తున్నారు. మరోవైపు అత్యాచారం జరిగిన విషయం కూడా పరీక్షల తర్వాతే నిర్ధారిస్తామని వారంటున్నారు. కాగా, గత నెలలో ఓ యువతి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. తాను పని చేసే సంస్థకు 500 మీటర్ల దూరంలోనే వెస్ట్ బెంగాల్ కు చెందిన అంతారాదాస్ అనే టెక్కీని ఓ ఆగంతకుడు వెంటాడి మరీ కిరాతకంగా హత్య చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more