ప్రజాస్వామ్య ప్రక్రియ దెబ్బతీసేలా భారతీయ సెంట్రల్ బ్యాంకు రిజర్వు బ్యాంకు చర్యలు వున్నాయని.. కేంద్ర ఎన్నికల కమీషన్ అర్బీఐపై మొట్టికాయలేసింది. నగదు విత్ డ్రాపై ఉన్న పరిమితిని పెంచాలన్న తమ వినితిని భారతీయ రిజర్వు బ్యాంకు తిరస్కరించడంపై ఎలక్షన్ కమీషన్ అగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమ అదేశాలను అర్బీఐ తప్పక పాటించాలని అదేశించింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థులకు విత్ డ్రా పరిమితిని పెంచాలని కొరుతూ గవర్నర్ ఉర్జిత్ పటేల్ కు మరో లేఖను రాసింది.
ఈ మేరకు విన్నవిస్తూ కేంద్ర ఎన్నికల కమీషన్ రాసిన తొలి లేఖపై స్పందించిన భారతీయ రిజర్వు బ్యాంకు.. ఈసీ కొరిన్నట్లు తాము విత్ డ్రా పరిమితిని పెంచలేమని స్పష్టం చేసింది. ఈ చర్య సరైంది కాదనీ, అంగీకరించలేమని ఈసీ తెలిపింది. దానికి బదులుగా ఈసీ రాసిన రెండో లేఖలో కనీసం చట్టబద్ధమైన ఎన్నికల వ్యయం కోసం అభ్యర్థులకు నగదు విత్ డ్రాలపై నిరోధం ఉండకూడదని సూచించింది. నగదు ఉపసంహరణకు అనుమతి నివ్వాలని మరోసారి కోరింది.
ప్రస్తుతం వారానికి ఉన్న రూ. 24 వేల పరిమితిని రూ. 2లక్షలకు పెంచాల్సిందేనని తేల్చి చెప్పింది. చట్ట ప్రకారం ఆయా అభ్యర్థులకు రూ. 28 లక్షల దాకా ఖర్చుచేసే హక్కు వుందని స్పష్టం చేసింది. పరిస్థితిని అర్థం చేసుకోకుండా ఆర్బీఐ తొందరపడిందని తన లేఖలో పేర్కొంది. ఎన్నికల సందర్భంగా నగదు ద్వారా మాత్రమే చెల్లించాల్సిన అనేక బిల్లులు ఉన్నాయని.. అభ్యర్థులు నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందిన నేపథ్యంలో స్పందించిన ఈసీ ఆర్బీఐని ఈ మేరకు అర్బీఐకి లేఖరాసింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more