సోషల్ మీడియాలో హీరోలు అయ్యేందుకు కొందరు అకతాయిలు చేస్తున్న పద్దతులపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అయ్యింది. తమ వీడియోలు వైరల్ గా మారి.. వాటి నుంచి డబ్బులు కూడా పొందేందుకు చేస్తున్న సరదా వీడియోలు ఒకరి మనస్సును నొప్పించడం వంటి చర్యలపై తీవ్రంగా స్పందించింది. ముద్దు పెట్టి సారీ చెబితే సరిపోతుందా.. వీడియోలను సోషల్ మీడియా నుంచి తొలగించినంత మాత్రన తప్పులన్నీ ఒప్పులుగా మారవని, ఇకపై ఇలాంటి వీడియో పోస్టింగులపై చర్యలు తప్పవని తేల్చిచెబుతుంది.
ఇకరి సరదా.. మరొకరి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుందని, ఈ వీడియోలలో తాము ఎదుర్కోన్న పరిస్థితులు బాధితతులను జీవితాంతం వేధిస్తుంటాయని కూడా కేంద్రం చెప్పింది. వీటి ప్రభావం సమాజం విలువలపైనా పడుతున్నాయని పేర్కోంది. సోషల్ మీడియా వేదికగా ప్రాంక్స్ పేరుతో జరుగుతున్న నీచమైన వీడియోలపై కేంద్రం కన్నెర్ర చేసింది. ప్రాంక్స్ చూసే.. ఇటీవల బెంగళూరులో జరిగిన ఘటనలకు ఎగ్జాంపుల్ అని నిందితులు చెప్పటం దేశ వ్యాప్తంగా సంచలనం అయ్యింది.
రోడ్డుపై వెళుతున్న ముక్కూ ముఖం తెలియని అమ్మాయిని ముద్దు పెట్టుకుని పరిగెత్తటం.. భార్యభర్తలు వెళుతుంటే భర్త ముఖానికి క్రీమ్ రాసి.. అతని భార్యను హగ్ చేసుకోవటం ఏం సంస్కృతి చెబుతోందని నెటిజన్లు మండిపడుతున్నారు. నేటి యువత ఇలాంటి ప్రాంక్స్ ను యూట్యూబ్ లో చూసి అనుకరించటం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇలాంటి విషయాలు చాలా వరకు పోలీస్ స్టేషన్ వరకు కూడా రావటం లేదు. సారీతోనే సరిపెడుతున్నారు.
ఇటీవల బెంగళూరులో అర్థరాత్రి ఓ అమ్మాయిని కౌగిలించుకోవటం సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. విచారణలో కావాలనే అలా చేశామంటూ నిందితులు చెప్పడం పోలీసులనే విస్మయపరిచింది. ప్రాంక్స్ పేరుతో అమ్మాయిలను లైంగిక వేదింపులకు గురిచేసి ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేస్తే అట్టివారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు పోలీసులు. కఠిన శిక్ష విధించడంతో పాటు చదివిన డిగ్రీని రద్దు చేస్తామని పాస్ పోర్ట్ కూడా రద్దు చేసి ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లకుండా అడ్డుకుంటామని పోలీసులు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more