దశాబ్దాలుగా వున్న ఉద్ధానం కిడ్నీ సమన్యను పరిష్కారించడంలో గత ప్రభుత్వాలు ఘోరంగా విఫలయమ్యాయని.. ఇక ఈ సమస్యపై 48 గంటల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మంత్రి కామినేని చేసిన వ్యాఖ్యలకు ఆంధ్రప్రదేశ్ సిపిఐ కార్యదర్శి కె. రామకృష్ణ కౌంటర్ ఇచ్చారు. జనసేన అధినేత పవన్ కల్యాన్ చేసిన డిమాండ్లలో న్యాయం ఉందని రామకృష్ణ బాసటగా నిలిచారు. శ్రీకాకుళం జిల్లాలో కిడ్నీ బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించ లేకపోవడం అన్యాయమనన్నారు.
పవన్ కల్యాణ్ గొంతెమ్మ కోర్కెలంటూ వ్యాఖ్యానించిన కామినేనిపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రత్యేక విమానాలలో విదేశీయానాలు చేసేందుకు కోట్ల రూపాయలను తగిలేస్తున్న ప్రభుత్వం.. తమను ఎన్నుకున్న ప్రజల అరోగ్యాల కోసం మాత్రం వంద కోట్ల రూపాయలను ఖర్చు చేయలేరా అని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందన్నారు. రైతుల దీనావస్థలు, ఆత్మహత్యలు, ప్రబలుతున్న వ్యాధుల గురించి పట్టించుకోకుండా అవాస్తవాలను ప్రచారం చేయడమే చంద్రబాబు చెబుతున్న స్వర్ణాంధ్రప్రదేశ్ నిదర్శనమా అని ఆయన ప్రశ్నించారు.
శ్రీకాకుళం జిల్లాలో వేలాది మంది కిడ్నీ బాధితులున్నారని.. వారిని రోగ విముక్తులు చేయడానికి నిధులను కేటాయించామని కోరితే అవి అమెదయోగ్యం కానివిగా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని రామకృష్ణ దుర్మార్గమన్నారు. కిడ్నీ వ్యాధులకు గురై అనేకమంది ప్రాణాలు కోల్పోవడం జరిగిందన్నారు. కిడ్నీ బాధితులకు బస్పాస్లు ఇవ్వాలని, మండలానికొక నెఫ్రాలజీ డాక్టర్ను నియమించమనీ, 100 కోట్ల రూపాయలను కేటాయించమని పవన్ క ల్యాణ్ అడిగితే దానికి కూడా ప్రభుత్వం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. పవన్వి గొంతెమ్మ కోర్కెలన్నట్లు మంత్రి కామినేని శ్రీనివాస్ అదెట్లా సాధ్యమవుతుందని మాట్లాడటం సరైంది కాదన్నారు. ప్రజారోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించటం ఎంతవరకు సమంజసమని రామకృష్ణ నిలదీశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more