శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో తీవ్రంగా ఉన్న కిడ్నీల బాధితుల గోడును ప్రభుత్వానికి వినిపించిన విషయం తెలిసిందే. అంతేకాదు ముఖాముఖి జరిపి అక్కడి వేదనను కళ్లకు కట్టినట్లు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చూపించాడు. ఈ క్రమంలో డెడ్ లైన్ ఇవ్వటం, ఆపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా స్పందించి ఉద్దానం బాధితులకు అండగా నిలుస్తామని ప్రకటించటం చూశాం.
ఇక నిన్న చంద్రబాబు ప్రకటించిన సాయం పట్ల ఈ రోజు పవన్ కల్యాణ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. బాధితుల సమస్య తీవ్రతను జిల్లా నేత, మంత్రి అయినా కింజారపు అచ్చెంనాయుడు కన్నా ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థం చేసుకున్నారంటూ అందులో తెలిపాడు. బాధితుల సమస్యపై స్పందిస్తూ చంద్రబాబు చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. కష్టాలు ఎదుర్కుంటున్న ఆ బాధితుల సమస్యలపై స్పందించడం అన్ని పార్టీల బాధ్యత అని పవన్ కల్యాణ్ అన్నాడు. వారి సమస్యలు పూర్తిగా తొలగిపోవడం కోసం ఏపీలోని అన్ని రాజకీయ పార్టీలు స్పందిస్తూనే ఉండాలని కోరాడు.
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన ఉద్దానం బాధితుల సమస్యలను పరిష్కరించడానికి పడిన మొదటి అడుగుగా అభివర్ణించారు. కళింగ లేదా ఉత్తరాంధ్రకు భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు వచ్చినా తాము అండగా జనసేన ఉంటుందని తెలిపాడు. నిస్సహాయులుగా ఉన్న బాధితుల పక్షాన నిలబడి వారి సమస్యలను వివరించడానికి కృషి చేసిన మీడియాకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్లు పేర్కొన్నాడు. వారికి మీడియా సపోర్ట్ ఇలాగే కొనసాగాలని ఆయన ఆకాంక్షించాడు.
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2017
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2017
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2017
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2017
— Pawan Kalyan (@PawanKalyan) January 7, 2017
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more