ఇన్నాళ్లు రండి బాబు రండీ అంటూ అప్యాయతగా పిలిచిన హోటళ్లు, రెస్టారెంట్లు.. ఇక సర్వీసు టాక్స్ చెల్లించడానికి సిద్దంగా వుంటేనే రండీ.. లేదంటే రాకపోయినా పర్వాలేదని తెగేసి చెబుతున్న రోజులోచ్చాయి. హోటళ్లు, రెస్టారెంట్లలో భుజించేవారిపై ప్రస్తుతం ఐదు నుంచి 20 శాతం వరకు బిల్లులో సర్వీసు టాక్స్ రూపంలో వడ్డెన పడుతుంది. అయితే వాటిరి పెద్దగా పట్టించుకోకుండానే ఇప్పటివరకు బిల్లు ఎంతైతే అంత ఇచ్చేవాళ్లు.
దీనిపై పిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కస్టమర్లు హోటళ్లు, రెస్టారెంట్ల సర్వీసుతో సంతృప్తి చెందితే.. చెల్లించవచ్చు.. లేదా చెల్లించాల్సిన అవసరం లేదని తాజాగా వినియోగదారుల వ్యవహారాల శాఖ వెల్లడించింది. దీంతో ఇలా చేస్తే తమకు వచ్చే ఆదాయానికి గండి పడినట్లేనని, రెస్టారెంట్లకు వచ్చే కస్టమర్లు వ్యాట్ మాదిరిగానే సర్వీసు టాక్స్ కూడా భాగమని తెలుసుకుని రావాలని కోరుతున్నారు. లేని పక్షంలో తమ రెస్టారెంట్లకు రాకపోయినా పర్వాలేదని అంటున్నారు. ఇక దీనిపై మరికోందరు రెస్టారెంట్ల ఓనర్లు ప్రభుత్వం పన్నులు వదులుకోదు కానీ.. మమల్ని సర్వీసు టాక్స్ వదులుకోమ్మని ఎలా చెబుతుందని ప్రశ్నిస్తున్నారు.
చట్ట ప్రకారంమే తాము ఈ చార్జిలను వసూలు చేస్తున్నట్టు జాతీయ రెస్టారెంట్ల సంఘం అధ్యక్షుడు రియాజ్ అమ్లాని స్పష్టం చేశారు. చట్ట విరుద్ధంగా, అన్యాయంగా తాము వ్యవహరించడం లేదని వివరణ ఇచ్చారు. సర్వీస్ చార్జి వసూళ్లను ఉద్యోగుల మధ్య సమానంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉద్యోగులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఉద్యోగుల ఆదాయపన్ను చెల్లించడం, రెస్టారెంట్ల వ్యాట్ బిల్లులాంటి వాటిల్లో భాగమంటూ సర్వీస్ చార్జి వసూలు సమర్ధించుకున్నారు.
మరోవైపు ప్రభుత్వం తాజా ఆదేశాలకు బదులు సర్వీస్ చార్జ్ ను రద్దు చేసి ఉంటే బావుండేదని మరి కొంతమంది రెస్టా రెంట్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రెస్టారెంట్ అద్దెలు, మార్కెట్లో పోటీ , కార్మికుల జీతాలు పెరుగుతున్నాయని ప్రముఖ చెఫ్, మంకీ బార్ అవుట్ లెట్స్ ప్రతినిధి మనుచంద్ర వ్యాఖ్యానించారు. ఇపుడిక ఈ ఖర్చులకోసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలంటూ నిట్టూర్చారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more