వేగంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, శాస్త్ర సాంకేతిక రంగం కూడా మారాల్సిన అవసరం ఉందని దేశ ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం తిరుపతిలో ప్రారంభమైన 104వ భారత సైన్స్ కాంగ్రెస్ వేడుకలను ఆయన అట్టహసంగా ప్రారంభించారు. పలువురు నోబెల్ బహుమతి గ్రహీతలతో పాటు గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తదితరులు ప్రారంభసభకు హాజరయ్యారు.
సవాళ్లను ఎదుర్కొంటూ భారత శాస్త్రవేత్తలు ముందుకు సాగుతున్నారని, వారికి తన అభినందనలని ప్రారంభోపన్యాసం సందర్భంగా మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల సృజనాత్మకత, శక్తి సామర్థ్యాలను దేశం గౌరవిస్తోందని, ప్రభుత్వం సైతం అధికంగా నిధులిచ్చి కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోందని తెలిపారు. పర్యావరణంతో పాటు నీటి శుద్ధి రంగాలు ఎంతో కీలకంగా మారాయని, ఈ రంగంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోందని, వీటి పరిష్కారానికి సైంటిస్టులు కదలాలని చెప్పారు. 12 కీలక రంగాలపై ప్రత్యేక దృష్టిని సాగించాల్సి వుందని, సైబర్, రోబోటిక్స్ రంగాలు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాల్సి వుందని పిలుపునిచ్చారు.
డిజిటల్ ఇండియా ద్వారా మాన్యుఫాక్చరింగ్ రంగ అభివృద్ధికి కృషి జరుగుతోందని నరేంద్ర మోదీ తెలియజేశారు. వాతావరణ మార్పులతో పాటు హాని చేసే సాంకేతిక అంశాలపై అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ప్రపంచాన్ని ముందుకు నడిపేలా మన శాస్త్రవేత్తలు కొత్త ఆవిష్కరణలకు నాంది పలకాలని కోరారు. అందుకు వేసే ప్రతి అడుగుకూ తన మద్దతు ఉంటుందని తెలిపారు. సమాజ సాధికారతకు శ్రమిస్తున్న శాస్త్రవేత్తలకు దేశ ప్రజలు కృతజ్ఞతతో ఉంటారని, దీర్ఘకాల ప్రయోజనాల కోసం కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. యూనివర్శిటీలు, ఐఐటీలు, స్టార్టప్ సంస్థలు, మంత్రిత్వ శాఖలూ సమన్వయంతో పనిచేయాలని, 2030 నాటికి శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచంలోనే మొదటి మూడు దేశాల్లో ఇండియా ఒకటిగా నిలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ రంగాల్లో ల్యాబొరేటరీల నిర్వహణను మరింత సులభతరం చేయాల్సి వుందని, అందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని నిధులిచ్చి ప్రోత్సహిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇచ్చారు. పాఠశాలల స్థాయి నుంచే విద్యార్థుల ఆలోచనల మదింపు జరగాలని, కొత్త ఆలోచనలు విద్యార్థుల నుంచి వచ్చినప్పుడు, అధ్యాపకులే ప్రోత్సహించాలని కోరారు. దేశంలో శాస్త్ర, సాంకేతిక విధానాలు వికసించేలా నీతి ఆయోగ్ పలు నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు. ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సులో పాల్గొనడం తనకెంతో ఆనందాన్ని కలిగిస్తోందని, ఈ సదస్సు పలు నూతన ఆవిష్కరణలకు నాంది పలకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలియజేశారు.
భవిష్యత్ అంతా టెక్నాలజీ పైనే-చంద్రబాబు
శాస్త్ర, సాంకేతిక రంగాల్లో దేశం దూసుకుపోతోందని, ఆర్థిక సంస్కరణల్లో భాగంగా పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ వంటి రెండు అతిపెద్ద నిర్ణయాలను తీసుకున్నారన్నారు. భారత్ మానవ వనరుల కేంద్రంగా మారిందని, ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులే ఉంటున్నారని అన్నారు. భవిష్యత్ అంతా టెక్నాలజీ వినియోగంపైనే ఆధారపడి ఉంటుదన్న ఆయన, ఏపీలో బయోమెట్రిక్ పద్ధతిలో చౌకదుకాణాల నుంచి సరుకులు అందిస్తున్నామని, మొబైల్స్ ద్వారా ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్నామని , నెలకు రూ.149 లకు ఫైబర్ గ్రిడ్ సేవలు తదితర అంశాలను ప్రస్తావించారు.
ఇక సమావేశంలో పాల్గొన్న అనంతరం ప్రధాని మోదీ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట గవర్నర్ నరసింహన్, సీఎం చంద్రబాబు ఉన్నారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more