సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో అస్పత్రిలో చేరి.. కోలుకున్నాక ఇక అస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి రాష్ట్ర పగ్గాలను అందుకుంటారన్న నేపథ్యంలో మరోమారు అమె తీవ్ర అస్వస్థతకు గురై.. హఠాన్మరణం చెందిన తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అస్తుల కేసులో రాష్ట్ర హైకోర్టు స్పష్టతనిచ్చింది. జయలలితకు చెందిన హైదరాబాద్లోని జీడిమెట్లలో ఓ ఫాంహౌస్, శ్రీనగర్ కాలనీలో ఓ భవనంతో పాటు మేడ్చల్ లోని ఫామ్ హౌజ్ లను రాష్ట్ర ప్రభుత్వం స్వాథీనం చేసుకునేలా అదేశాలు ఇవ్వాలని ఓ న్యాయవాది హైకోర్టులో పిల్ వేశారు.
ఈ ఆస్తులకు సంబంధించి జయలలిత ఎలాంటి వీలునామా రాయలేదని ఆ ఆస్తులను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకునేలా ఆదేశాలివ్వాలని గరీబ్ గైడ్ సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను విచారించిన రాష్ట్రోన్నత న్యాయస్థానం హైకోర్టు సదరు సంస్థకు చివాట్లు పెట్టింది. ప్రచారం కోసమే ఇలాంటి పిటిషన్లు వేస్తున్నారని మండిపడింది. ఇందుకు గాను లక్ష రూపాయల జరిమానా కూడా చెల్లించాలని పిటీషనర్ ను అదేశించింది.
జయలలితకు వారసులు లేరని.. అమెకు చెందిన ఆస్తులను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా అదేశాలు ఇవ్వాలన్న పిటీషన్ పై విచారణ జరిపిన న్యాయమూర్తి.. ఆగ్రహం వ్యక్తం చేశారు. జయలలిత వీలునామా రాయలేదని, ఆమెకు వారసులు లేరని మీరెలా ఊహిస్తారని పిటిషనర్లను ప్రశ్నిస్తూ వ్యాజ్యాన్ని కొట్టివేశారు. అమె అన్న సంతానం వున్నారు కాబట్టి.. వీలునామా రాయకపోయినా.. హిందూ చట్టం ప్రకారం అస్తులు వారికే చెందుతాయని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇటువంటి పిటిషన్లు మరోమారు దాఖలు చేయారాదని గరీబ్గైడ్ సంస్థను అదేశించింది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more