అరుణాచల్ ప్రదేశ్ లో నిర్మితమవుతున్న కొత్త పవర్ ప్రాజెక్టు పనులను తన సమీప బంధువులకు ఇప్పించి.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్టు 450 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరలేపారని అరోపణలు గుప్పుమన్న నేపథ్యంలో వీటిపై ఆయన స్పందించారు. తనపై వస్తున్న అరోపణలన్నీ సత్యదూరమని కొట్టిపారేశారు. ఇలాంటి కల్పిత కథనాలను తనపై సృష్టించిన వారు ముందుకు వస్తే.. ఖచ్చితంగా చెప్పుదెబ్బలు తింటారని అయన అన్నారు.
సొంత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్లో నిర్మితమవుతున్న హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు బిల్లులను త్వరతగతిన క్లియర్ చేయాలని ఆయన కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పియుష్ గోయల్ కు లేఖ రాయడమే ఇందుకు ఊతమిస్తుంది. అయితే ధీనిపై స్పందించి మంత్రి తాను పియుష్ గోయల్ కు లేఖ రాసిన మాట వాస్తవమేనన్నారు. తన పార్లమెంటు నియోజక ప్రజల సమస్యల పరిష్కారంలో భాగంగా తన దృష్టికి వచ్చిన పెండింగ్ బిల్స్ సమస్యపై తాను స్పందించి లేఖ రాశారని, అంతమాత్రన తాను ఎక్కడా తప్పు చేయలేదని, అవినీతికి పాల్పడలేదని చెపుకోచ్చారు.
ఈ కుంభకోణంలో కిరెన్ పాత్ర ఉందడానికి తమ వద్ద 'ఆడియో ప్రూఫ్' ఉందని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రిజిజు నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఈ విద్యుత్ ప్రాజెక్టు ప్రదేశంలో గుట్టలు, రాళ్లు తొలగించడానికి భారీగా పెంచిన ధరలతో, కల్పిత బిల్లులతో అక్రమార్కులు లబ్ధి పొందారని, తన ప్రోద్బలంతో వారికి రిజిజు అండగా నిలిచారని, రిజిజు బంధువు నేరుగా ఈ హైడల్ ప్రాజెక్టుతో సంబంధం ఉందని కథనాలు వచ్చాయి. కాగా, ఈ కుంభకోణం విషయంలో తననెలాంటి వివరణ కూడా ప్రధాన మంత్రి కార్యాలయం కోరలేదని ఆయన స్పష్టం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more