దేశంలోని అవినీతిని, నల్లధనాన్ని తరమికోట్టేుందుకు పెద్ద నోట్లను రద్దు చేస్తూ చర్యలు తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. డిజిటల్ మనీ, క్యాష్ లెస్ ఇండియాగా రూపాంతరం చెందాలని భావిస్తుంది. ఈ తరుణంలో అందుకు కొంత సమయం పడుతుందని భావించిన కేంద్రం.. ముందుగా రూ. 500, రూ. 2000 కొత్త కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టింది. అయితే కేంద్రం కొత్తగా ప్రవేశపెట్టిన పెద్ద నోట్ల నాణ్యతను పరీక్షించే పనిలో కొందరు బిజీగా గడిపేస్తున్నారు. ఇప్పటికే రూ.2000 నోటుపై వివిధ రకాలుగా పరీక్షలు చేసిన వీడియోలు ఆన్ లైన్ లో సంచలనం చేశాయి.
కొత్త నోటు నలుగుతుందా, వాటర్ ప్రూఫా అని పరీక్షించారు. రూ. 2000 నోటును నీటిలో ముంచి పరీక్షించారు. తడిసిన నోటు రంగు కిద్దిగా పోయింది. ఇది కాస్త పెను సంచలనంగా కొత్త నోటు రంగుపోతుందన్న కూడా వార్తలు రావడంతో.. అర్భీఐ దీనిపై స్పష్టతను కూడా ఇచ్చింది. కేంద్రం ముద్రించిన కొత్త నోటు రంగు పోతేనే అది ఒరిజినల్ అని, లేకపోతే కాదు అని కూడా కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తకాంత్ దాస్ స్పష్టతనిచ్చారు. దీంతో నోటు తడిసిన ఇబ్బందులు లేవని తేల్చారు. యూట్యూబ్ లో ఈ వీడియోలను కోట్లాది మంది వీక్షించారు.
కాగా, ఇప్పటికీ దేశ ప్రజలతో ఇదిగో వస్తున్నాను.. అదిగో వస్తున్నాను అంటూ దోబూచులాడుతున్న కొత్త రూ.500 నోటు కొందరికి మాత్రం లభించింది. ఈ నోటు దర్శనం చేసుకుందామన్నా.. ఎవరికీ అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ నోటుపై పరీక్షలు ఇంకా మెదలు కాలేదు. అయితే వచ్చిన నోట్లలో పలు నోట్లు తప్పదాల కారణంగా వెనక్కు వెళ్లిపోయాయి. ఈ నోట్లను అర్భీఐ కాకుండా కేంద్ర ప్రభుత్వే పలు ప్రాంతాలలో రహస్యంగా ముద్రణకు అనుమతించిందని, ఈ విషయంలో ప్రజలు అర్భీఐని తప్పుబట్టడం సమంజసం కాదని కూడా అర్భీఐ అధికారులు వెల్లడించారు.
ఇదిలావుంటూ ఈ నోటను దక్కిన హైదరాబాద్ శంకరమఠంకు చెందిన సాయికృష్ణ ఆజాద్ అనే హైకోర్టు న్యాయవాది అయోమయ స్థితికి లోనయ్యారు. ఏటీఎం నుంచి డ్రా చేసిన రూ. 500 నోటు చేతిలోంచి జారి నీళ్లలో పడిపోయింది. వెంటనే ఆ నోటును నీళ్లలోంచి తీసి..తుడిచి ఫ్యాన్ గాలికి ఆరబెట్టారు. ఐదు నిమిషాలు తరువాత చూడగా ఆ నోటు రంగు వెలిసి నోటు ఆనవాళ్లు కోల్పోయింది. నోటులోని జాతిపిత గాంధీ బొమ్మతో పాటు ఇతర అక్షరాలు రూపం కోల్పోపోయాయి. దీంతో ఖంగుతిన్న అతను నోటు అసలా. నకిలీదా అని అయోమయస్థితికి చేరాడు. ఏటీయం నుంచి డ్రా చేసిన నోటు ఇలా మారిందని ఆందోళన వ్యక్తం చేశాడు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more