టీడీపీలో చేరిన కదిరి ఎమ్మెల్యేకు షాక్.. villagers gives shock to kadiri mla chand pasha

Villagers gives shock to kadiri mla chand pasha

villagers against mla, kadiri mla, chand basha, ysrcp, TDP, ruling party, andhra pradesh, jana chaitanya yatra, poster against mla chand basha, poster against khadir mla

posters against defected ysrcp mla of kadiri constituency chand pasha in the entrance of burugupally village stating not to enter into village in the pretext of jana chaitanya yatra.

టీడీపీలో చేరిన కదిరి ఎమ్మెల్యేకు షాక్..

Posted: 11/13/2016 10:04 AM IST
Villagers gives shock to kadiri mla chand pasha

కదిరి ఎమ్మెల్యే చాంద్ ఫాషాకు తన నియోజకవర్గంలో షాక్ తగులుతుంది. తనకు ఓటు వేసి గెలిపించిన నియోజకవర్గ ప్రజలే తమ గ్రామంలోకి రాకూడదని ఫెక్సీలు పెట్టారు. కదిరి అర్బన్ మండల పరిధిలోని బూరుగుపల్లిలో ఎమ్యెల్యే అత్తార్‌ చాంద్‌ బాషా గ్రామంలోకి రాకూడదంటూ మార్గంలో ఫ్లెక్సీ వెలిసింది. కదిరి మండలంలో మొటుకుపల్లి, కౌలేపల్లి, కుమ్మరవాండ్లపల్లి, బూరుగుపల్లెల్లో ఎమ్యెల్యే జనచైతన్య యాత్రలు నిర్వహించారు. గ్రామానికి ఎమ్యెల్యే వస్తున్నారన్న సమాచారంతో గుర్తు తెలియని వ్యక్తులు ఫ్లెక్సీని చెట్టుకు కట్టారు.

పార్టీలు మారిన వారు జనచైతన్యయాత్రలు చేయవచ్చా ? అంటూ ఫ్లెక్సీలో పేర్కోన్నారు. పార్టీలు మారిన వారు జనాలను ఎలా చైతన్య పరుస్తారంటూ.. ఆయనను నిలదీసినట్లుగా ఈ ఫ్లెక్సీల్లో వుంది. అయితే ఎవరో కట్టారో.. ఎందుకు కట్టారో తెలియరాలేదు. మొటుకుపల్లిలో నిర్వహించిన జనచైతన్యయాత్రలో  తాగునీటి సమస్యను కొందరు ఎమ్యెల్యే దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్యెల్యే వెంట ఎస్‌ఎండీ ఇస్మాయిల్, కాటం శంకర్, అల్ఫాముస్తఫాతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles