పెద్ద నోట్లను రద్దు చేస్తూ కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అనేక కష్టాలు పడుతున్న నేపథ్యంలో కేంద్రం వారి ఇబ్బందులను దూరం చేసేందుకు చర్యలు తీసుకుంది. కొత్తగా రెండు వేల రూపాయల నోటును అందుబాటులోకి తీసుకువచ్చినా.. అంత పెద్ద మొత్తానికి చిల్లర ఇవ్వడాని తమ వద్ద లేకపోవడంతో.. దానిని వ్యాపారులు స్వీకరించేందుకు సిద్దంగా లేరు. దీంతో ప్రజలు చిల్లర కోసం అల్లాడుతున్న తరుణంలో కేంద్రం చర్యలకు ఉపక్రమించింది.
దీంతో కొత్తగా ప్రవేశపెట్టిన 500 రూపాయల నోట్లు ప్రజలకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం బ్యాంకుల్లో 2000 రూపాయల నోట్లు మాత్రమే ఇస్తుండగా, కొత్త 500 రూపాయల నోటు ఇంకా చెలామణిలోకి రాలేదు. త్వరలో కొత్త 500 రూపాయల నోట్లను కూడా బ్యాంకులకు పంపనున్నారు. ఇందుకోసం మహారాష్ట్రలో నాసిక్లోని కరెన్సీ నోట్ ప్రెస్ (సీఎన్పీ)లో ముద్రించిన 50 లక్షల కొత్త 500 రూపాయల నోట్లు రిజర్వ్బ్యాంకు చేరుకున్నాయి.
రెండో విడతలో మరో 50 లక్షల 500 రూపాయల నోట్లను బుధవారం కల్లా ఆర్బీఐకు పంపుతామని సీఎన్పీ అధికారి ఒకరు చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ్యలో 20, 50, 100 రూపాయల నోట్లను ముద్రించారు. ఆర్బీఐ ఈ నోట్లను బ్యాంకుల పంపనుంది. ఈ నోట్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే కరెన్సీ సమస్య తీరుతుంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరికల్లా 40 కోట్ల 500 రూపాయల నోట్లను ముద్రించాలని సీఎన్పీకి ఆదేశాలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more