ఒడిశా రాజధాని భువనేశ్వర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగిన అగ్నిప్రమాదంలో క్షతగాత్రుల సంఖ్య పెరుగుతుంది. సోమవారం అర్థరాత్రి విద్యుద్ఘాతంతో సంభవించిందని అనుమానిస్తున్న ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతూ పెరుగుతుంది. సుమారు 22 మంది సజీవ దహనం అయ్యారు. 100 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. సంఘటన విషయం తెలిసిన ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
కాగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి సంఖ్య కేవలం 19 మందేనని ఒడిశా అరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. నిన్న 22గా ప్రభుత్వం ప్రకటించిన వివరాలు తప్పని, అసలుకు అక్కడ మృత్యువాత పడింది మాత్రం 19 మందేనని అరోగ్యశాఖ ఇవాళ తెలిపింది. ఎంత మంది మరణించింది అన్న వివరాలు చెప్పడం బదులు.. మృతుల కుటుంభికులకు, క్షతగాత్రులకు అవసరమైన చికిత్సను అందించడంలో ప్రభుత్వ ముందుగా చర్యలు తీసుకోవడానికి బదులు మృతుల సంఖ్యలో తేడాలను చెప్పడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఇక అసుపత్రుల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలు తీసుకోవాలని, అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో పేషంట్లతో పాటు వారి అటెండర్లు, అస్పత్రి స్టాఫ్ సురక్షితంగా కిందకు దిగేందుకు మారో మార్గం ఏర్పాటు చేయాలన్న నిబంధనలు పాటించాయా లేదా..? అన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ప్రమాదం గురించి తెలిసిన వెంటనే ప్రధాని మోదీ సహా పలువురు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more