పదేళ్లు ఉమ్మడి రాజధాని ఒప్పందం ఉన్నా సరే... ఇక హైదరాబాద్ లో ఉండటం మంచిది కాదన్న భావనకు వచ్చిన చంద్రబాబు వీలైనంత త్వరగా నవ్యాంధ్ర రాజధాని అమరావతికి తరలివెళ్లేందుకు సన్నాహాలు చేశాడు. అంతేకాదు ఇప్పటికే వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం ప్రారంభమై వారంలో ఐదు రోజులు అధికారులు, మంత్రులతో సందడి నెలకొంటోంది. దీంతో ఇక్కడ కొత్త సచివాలయాన్ని నిర్మించాలని ఎప్పటి నుంచో కాచుకుని ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి లైన్ క్లియర్ అయినట్లు చెప్పుకోవచ్చు.
కార్యాలయాలు దాదాపుగా తరలిపోవటంతో ఆంధ్రప్రదేశ్ అధీనంలో ఉన్న భవనాల నుంచి ఆంధ్రావారిని ఖాళీ చేయించి తమకు అప్పగించేలా చూడాలని సీఎం కేసీఆర్ గవర్నర్ నరసింహన్ కు విజ్ఞప్తి చేశారు. సోమవారం రాజభవన్కు వెళ్లి గవర్నర్ ను కలిసి ఇదే అంశాన్ని చర్చించినట్టు అధికార వర్గాల సమాచారం. సెక్రటేరియేట్ ప్రస్తుతమున్న చోటే తిరిగి నిర్మించాలని భావిస్తున్నామని, నవంబర్ లో పునాది వేస్తామని ఆయన స్పష్టం చేస్తూ, విభజనతో ముడిపడ్డ సున్నితమైన అంశం కావడంతో తొలుత గవర్నర్ దృష్టికి తీసుకు వచ్చినట్టు తెలుస్తోంది.
సచివాలయంలోని ఏపీ భవనాలను ఖాళీ చేస్తే, ప్రతిగా వేరే ప్రాంతంలో ఆఫీసు భవనాలు చూస్తామని ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీకి లేఖ రాసిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారంట. సచివాలయం పక్కనే ఉన్న బూర్గుల రామకృష్ణారావు భవనంలోకి కీలక శాఖలను, ఆపై ఎర్రమంజిల్, హిమాయత్ నగర్ ప్రాంతాల్లోని వివిధ విభాగాల కార్యాలయాలకు ఆయా శాఖలను తరలించాలని భావిస్తున్నట్టు కేసీఆర్ వివరించినట్లు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం దగ్గర రెండు ఫ్లాన్ లు ఉన్నాయి. వారు నిరభ్యరంతంగా అప్పగిస్తే ప్రముఖ ఆర్కిటెక్క్ హఫీజ్ కాంట్రాక్టర్ తయారు చేసిన డిజైన్తో 'యు' ఆకారంలో రూ.350 కోట్లతో కొత్త భవనం నిర్మించడం. అలా కాకుండా విభజన చట్టంలో పది సంవత్సరాల గడువు ప్రస్తావన లెవనెత్తితే మాత్రం తాత్కాలికంగా పది అంతస్తులతో రూ. 180 కోట్లతో కొత్త సచివాలయాన్ని నిర్మించడం రెండవ ఆలోచన. ఈ రెండింటిలో ఏది జరిగినా... ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వానికి కేటాయించిన ఎ నుంచి డి బ్లాక్ల వరకు ఉన్న భవనాలను డిసెంబర్లో కూల్చివేసి కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కెసిఆర్ గవర్నర్కు వివరించినట్టు సారాంశం.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more