సర్జికల్ దాడులు.. టెక్నికల్ గా ఈ పేరు మనకు కొత్త. అయితే ఇప్పుడు భారత్ దేశంతో పాటు పాకిస్తాన్ సహా పలు దేశాలు, ఐక్యరాజ్యసమితిలో కూడా ఈ అంశమే ప్రధానంశమైంది. ఇక ఈ దాడులపై దేశంలో ఎక్కడ నలుగురు కలసినా వీటిపైనే చర్చ. ఆర్మీలో వున్నవారికి మాత్రం ఈ దాడుల గురించి తెలుసు. ఏ సందర్భంలో ఎలా ఈ దాడులకు పాల్పడాలో.. ఆర్మీకి తెలుసు. ఇటీవల పాక్ అక్రమిత కాశ్మీర్ లోకి చోచ్చుకెళ్లిన భారత సైన్యం అక్కడున్న ఉగ్రవాద స్థావరాలపై దాడులు నిర్వహించి 40 మందిని మట్టుబెట్టింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
అసలు దాడులు జరిగాయా..? అని ఐక్యరాజ్యసమితి సందేహాలను వ్యక్తం చేయడంతో.. ఆధారాలను చూపించాలని దేశంలోని ప్రతిపక్షాలు కూడా తమ వాదనను తెరపైకి తీసుకోచ్చాయి. అది చాలదన్నట్లు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం మారో అడుగు ముందుకేసీ తమ హయాంలోనూ సర్జికల్ దాడులు జరిగాయని అన్నారు. అయితే ఈ దాడులను తాము దేశ రక్షణ శాఖల అంశంగా పరిగణించామే తప్ప, రాజకీయ లబ్దని అలోచించి ప్రజల్లోకి తీసుకువెళ్లలేదని కూడా తెలిపారు. అయితే అవి సర్జికల్ దాడులు కావని, వాటికి తాజాగా జరిగిన దాడులకు చాల వత్యాసముందని అర్మీ మాజీ డిజీఎంవో తెలిపారు.
అయితే ఈ నేపథ్యంలో కాంగ్రెస్ హయాంలో 2011లోనే సర్జికల్ దాడులు జరిగాయని అంటున్నాయి తాజా నిజాలు. ఈ దాడుల్లో పాక్కు భారత్ ధీటుగా బదులిచ్చిందంటూ ‘ది హిందూ’ ఆంగ్ల దినపత్రిక ఆదివారం తన కథనంలో పేర్కొంది. భారత ఆర్మీ సర్జికల్ దాడులు నిర్వహించిందని, ఇందులో 8 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారంటూ అధికారిక ఆధారాలు, వీడియో, ఫొటోల్ని సైతం బహిర్గతం చేసింది. అత్యంత హింసాత్మకంగా భారత్, పాక్ల మధ్య పరస్పర దాడులు జరిగాయని... ఇరువైపులా మొత్తం 13 మరణించారంటూ వెల్లడించింది.
ఆ పత్రిక కథనం ప్రకారం... ‘జూలై 30, 2011న కుప్వారా జిల్లా గుగల్దార్ పోస్టుపై పాక్ సైనికులు విరుచుకుపడ్డారు. ఐదుగురు భారతీయ సైనికులను దారుణంగా హత్యచేసి వారి తలలు నరికివేశారు. తమ వెంట హవిల్దార్ దేవేందర్ సింగ్, జైపాల్ సింగ్ల తలలు తీసుకెళ్లారు. మరో సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. దీంతో భారత్ ఆగస్టు 30, 2011న ‘ఆపరేషన్ జింజర్’ పేరిట సర్జికల్ దాడులతో పాక్ భూభాగంపై విరుచుపడింది. 8 మంది పాక్ సైనికుల్ని చంపి, ముగ్గురి తలల్ని భారత సైనికులు వెంట తీసుకొచ్చారు’ అంటూ పేర్కొంది. కుప్వారాలోని 28వ విభాగం ముఖ్య నిర్వహణ అధికారి ఈ సర్జికల్ దాడికి ప్రణాళిక రచించారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more