మహారాష్ట్ర మాజీ మంత్రి, ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవహాద్ దగ్గరుండి యువకుడిపై యువతితో దాడి చేయించారు. అంతాలా అశ్చర్యపోకండీ ఎందుకంటే అయన చేసిన పని సరైందేనని కూడా వాదనలు తెరపైకి వస్తున్నాయి. అందరు ప్రజాప్రతినిధులు ఆయనలా సమాజంలో పెడదోవ పడుతున్న యువతను సన్మార్గంలో నడిపించేందుకు చిన్నపాటి శిక్షలు వేసినా తప్పులేదని, దీంతో యువత కూడా తమ వెనుక ఎవరో వున్నారన్న భ్రమల్లోంచి భయంతో చెడుపనులను చేసేందుకు కూడా జంకుతారని అంటున్నారు మరికోందరు.
ఇదంతా థానెలోని ఆయన కార్యాలయంలో చోటు చేసుకున్న ఓ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో కలకలం రేగింది. జితేంద్ర దగ్గరుండి యువకుడిని యువతితో కొట్టించినట్టు వీడియోలోని దృశ్యాల్లో స్పష్టంగా కనబడటంతో ఆయనపై విమర్శలు సంధించే వాళ్ల సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతుండగా, ఒక ప్రజాప్రతినిధికి తన పరిధిలో జరిగే చెడును కూడా అడ్డుకునే హక్కు లేదా అన్ని మరో వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. అసలు ఇంతకీ విషయం ఏమిటంటారా..?
తనను ఓ యువకుడు నిత్యం వేదిస్తున్నాడని ఓ మైనర్ బాలిక ఎమ్మెల్యేను అశ్రయించింది. అతనని ప్రేమించని పక్షంలో అఘాయిత్యాలకు కూడా పాల్పడతానని హెచ్చరించాడని జితేంద్రకు యువతి ఫిర్యాదు చేసింది. ఎంతో భవిష్యత్తు వున్న యువత పెడదారి పట్టి ఎందుకిలా మారుతున్నారని సదరు యువకుడిని తన కార్యాలయానికి పిలిపించి విచారించానని ఎమ్మెల్యే తెలిపారు. ఆ తరువాత యువకుడు నేరాన్ని అంగీకరించడంతో.. అతడికి గుణపాఠం చెప్పాలని మైనర్ బాలికతో కొట్టించానన్నారు.
అయితే తాను చేసిందాట్లో తప్పేంలేదని జితేంద్ర సమర్థించుకున్నారు. ‘నేను చట్టాన్ని చేతిలోకి తీసుకున్నానని భావించినా తప్పులేదని, తాను సమాజహితం కోసమే అలా ప్రవర్తించాను తప్ప తప్పు చేయాలన్న ఉద్దేశ్యంతో కాదన్నారు. నేను తప్పుచేసినట్టు మీడియా భావిస్తే నన్ను ఉరి తీయండ’ని ఆవేశంగా అన్నారు. ఫిర్యాదు చేసిన యువతి తన ఇంటికి సమీపంలోని మురికివాడలో నివసిస్తోందని చెప్పారు. యువకుడి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యాయత్నం చేసిందని తెలిపారు. యువకుడిపై వేధింపుల కేసు నమోదు చేశారు. జితేంద్ర వ్యతిరేకంగా ఎటువంటి కేసు పెట్టలేదు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more